ఫలక్ నుమా దాస్ (2019)(A)
ఫలక్ నుమా దాస్ స్టోరి
ఫలక్నుమా దాస్ సినిమా యాక్షన్, రోమాంటిక్ ఎంటర్టైన్ చిత్రం ఇందులో విశ్వాక్ సెన్, సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి, తరున్ భాస్కార్, ఉత్తేజ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం విశ్వాక్ సెన్ వహించారు మరియు నిర్మాత కరాటీ రాజు అందించారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్ అందించారు.
కథ
ఫలక్నుమాలో దాస్ (విశ్వక్సేన్) తన దోస్తులతో అల్లరిచిల్లరిగా తిరిగే యువకుడు. అఫైర్లు, బ్రేకప్ల మధ్య ఫ్రెండ్స్తో మటన్ వ్యాపారం చేయడానికి సిద్ధమవుతాడు. కానీ రవిరాజ్ బ్యాచ్తో గొడవల కారణంగా మర్డర్ కేసులో ఇరుక్కుపోతాడు. ఆ కేసు నుంచి బయటపడటానికి రూ.20 లక్షలు అవసరమవుతాయి. ఫలక్నుమా దాస్ మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు? 20 లక్షలు సంపాదించడానికి ఏం చేశాడు? తన ప్రేమించిన మూడో ప్రేయసినైనా పెళ్లి చేసుకొన్నాడా? రవిరాజ్ గ్యాంగ్తో విభేదాలు ఎక్కడి వరకు వెళ్లాయి. చివరకు ఫలక్నుమా దాస్ ఎలా సెటిల్ అయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.