ఇద్దరి లోకం ఒకటే సినిమా రొమాంటిక్రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజ్ తరుణ్, శాలిని పాండే, నాజర్, మాస్టర్ భరత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జిఆర్ కృష్ణ వహించారు మరియు దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మించారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.
కథ
వర్ష (షాలినీ పాండే) తన తాతలా పెద్ద యాక్టర్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకోవాలని రాహుల్ (రాజా సిరివెన్నెల) మూడేళ్లుగా ఎదురుచూస్తూనే ఉంటాడు. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. మహి (రాజ్ తరుణ్) ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవుతాడు. అతను తన తండ్రి గుర్తుగా ఆయన తీసిన ఫోటోలన్నంటిని ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడతాడు. అందులో తన చిన్ననాటి ఫోటోను చూసి వర్ష గుర్తుపడుతుంది. అక్కడి నుంచి మహికి, వర్షకు పరిచయం ఏర్పడుతుంది. మహి-వర్షల మధ్య ఉన్న గతం ఏంటి? వారి పుట్టుకకు ఉన్న సంబంధమేంటి? మహికి ఉన్న గుండె సంబంధిత వ్యాధితో చివరకు ఏమైంది? హీరోయిన్ కావాలని వర్ష కన్న కలలు నిజమయ్యాయా? చిన్నతనం నుంచి వర్ష జ్ఞాపకాలతోనే ఉన్న మహి చివరకు ఏమయ్యాడు? చివరకు వీరిద్దరి లోకం ఒకటే ఎలా అయింది? అనే అంశాలకు సమాధానమే ఈ కథ.