జర్నీ చిత్రం తమిళ్ డబ్బింగ్ సినిమా ఇది ఒక డ్రామా ఎంటర్టైనర్ ఇందులో శర్వానంద్,జై ,అంజలి,అనన్య తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శరవణన్ ప్ నిర్వహించారు మరియు నిర్మాత సురేష్ కొండేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సత్య స్వరాలు సమకుర్చారు.
కథ
ఒకే సమయంలో విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చే ఆర్టీసి బస్సు,హైదరాబాద్ నుంచి విజయవాడుకు వెళ్తున్న ప్రెవేట్ బస్సు లో ఉన్న ప్రయాణీకులు ఎమోషనల్ జర్నీనే ఈ చిత్రం కథ.చిత్రమైన పరిస్ధితిల్లో విజయవాడనుంచి హైదరాబాద్ వచ్చిన అమృత(అనన్య)తో పరిచయమై ప్రేమలో పడతాడు గౌతమ్(శర్వానంద్).ఆమెతో విడిపోయి విజయవాడ వెళ్లిపోయాక రియలైజైన గౌతమ్ ఆమెను వెతుక్కుంటూ బయిలు దేరుతాడు. అదే సమయంలో ఆమె కూడా ఎదురుగా వచ్చే బస్సులో గౌతమ్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ వస్తూంటుంది. ఇక మరో జంట కృష్ణ(జై),మధుమతి(అంజలి) హైదరాబాద్ లో ప్రేమలో పడి విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కి తమ పెద్దలను కలవటానకి బయిలుదేరతాడు. ఈ లోగా బస్సు ఏక్సిడెంట్ అవుతుంది. అప్పుడు ఈ ప్రేమ జంటలు ఏమయ్యాయి.వీరి ప్రేమకథ ఏమైంది అనేది మిగతా కథ