నా రాకుమారుడు సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్ చంద్ర, రీతూవర్మ, సితార, ఎమ్మెస్ నారాయణ, కృష్ణభగవాన్, కొండవలస, మిక్కీ, సునీల్హార్స్, దీక్షాపంత్, రాధికారెడ్డి, భార్గవి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సత్య నిర్వహించారు మరియు నిర్మాతలు పి వజ్రాంగ్ (పి.ఎస్.రెడ్డి), కోడి వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతర్శకుడు అచ్చు స్వరాలు సమకుర్చారు.
కథ
కోటీశ్వరుడు కొడుకైన వైష్ణవ్ (నవీన్ చంద్ర) మరో రెండు నెలల్లో అమెరికా వెళ్తాడు. ఈ గ్యాప్ లో తనని ప్రేమించే వాళ్లని కాకుండా తనకి నచ్చిన అమ్మాయి ఎవరైనా తారసపడుతుందేమో చూస్తూంటాడు. ఆ క్రమంలో వైష్ణవ్కి బిందు (రీతూ వర్మ) పరిచయం అవుతుంది. ఆమెకు చదువంటే ఇష్టం ఉండదు. అమ్మ (సితార)బలవంతం మీద కాలేజీ వెళ్తుందంతే. వైష్ణవ్ని ఇష్టపడుతుంది. అది ప్రేమగా మారుతుంది. అయితే వైష్ణవ్ మాత్రం ఆమెను వదిలేసి అమెరికా వెళ్లిపోతాడు. ఆ బాధతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు ఏమైంది. చివరకు వీళ్లద్దరూ కలిసారా...అనేది మిగతా కథ.