శ్రీరామరాజ్యం సినిమా పౌరాణిక చిత్రం ఇందులో నందమూరి బాలకృష్ణ, నయనతార, అక్కినేని నాగేశ్వరరావు, మాస్టర్ గౌరవ్, మాస్టర్ ధనుష్కుమార్, శ్రీకాంత్, సమీర్, కె.ఆర్.విజయ, వింధు దారాసింగ్, బాలయ్య, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బాపు నిర్వహించారు మరియు నిర్మాత యలమంచిలి సాయిబాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజా స్వరాలు సమకుర్చారు.
కథ
దాదాపు అందరికీ తెలిసిన ఈ కథ శ్రీరామ(బాలకృష్ణ)పట్టాభిషేకంతో మొదలవుతుంది.ఆ తర్వాత ఓ రజకుడు మాటలు విని శ్రీరామచంద్రుడు తన భార్య సీత దేవి(నయనతార)ని అడవుల్లో వదిలేసి రమ్మంటాడు.అక్కడ ఆమె వాల్మికి(అక్కినేని)ఆశ్రమంలో తలదాచుకుని ఇద్దరు కవలలు లవకుశలకు జన్మనిస్తుంది.ఆ తర్వాత అశ్వమేధయాగం కోసమని బయిలుదేరిన లక్ష్మణుడు(శ్రీకాంత్)ని లవకుశలు ఎదిరించటం..శ్రీరాముడు స్వయంగా రంగంలోకి దిగటం..తన భార్యని,పిల్లలను కలుసుకోవటంతో ముగిసే ఎమోషనల్ డ్రామా.