Gundeninda Gudigantalu Weekly Review: సుందరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్..మీనాపై చింతామణి కుట్ర..మనోజ్కు షాక్
Gundeninda Gudigantalu Weekly: తెలుగు బుల్లితెర స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ కు ప్రత్యేక ఆదరణ ఉంది. స్టార్ మా ఛానెల్లో ప్రసారం అవుతోన్న 'గుండె నిండా గుడి గంటలు' హై టీఆర్పీతో దూసుకుపోతుంది. ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం అంటే జూన్ 22వ తేదీ నుంచి జూన్ 26వ తేదీ వరకూ ఏం జరిగిందంటే?
సోమవారం ఎపిసోడ్ లో మీనా విలువను ఇంట్లో అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో బాలు చేపట్టిన 'వంటింటి సమ్మె' విజయవంతమైంది. ఆకలితో అలమటించిన మనోజ్, రోహిణి, చివరకు ప్రభావతి కూడా మీనాకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ముఖ్యంగా మీనాను ఆమె తండ్రి ఇంటి నుంచి వెళ్లకుండా చేసింది తానేనని ప్రభావతి ఒప్పుకోవడం ఎపిసోడ్లో కీలక ఘట్టంగా నిలిచింది. ఆ మాటలన్నింటినీ బాలు ఫోన్లో రికార్డ్ చేయడం మరో పెద్ద ట్విస్ట్గా మారింది.

Photo Courtesy: JioHotstar
మరుసటి రోజు కూడా ప్రభావతి తన వైఖరి మార్చుకోకపోయినా, మీనా తన తెలివైన సమాధానాలతో అత్తను ఇరుకున పెట్టింది. ఇదే సమయంలో సుందరి ఇంటికి రావడంతో కథ కొత్త మలుపు తిరిగింది. బాలు బావ అంటూ సుందరి చనువుగా మాట్లాడటాన్ని చూసి మీనా అసూయపడగా, బాలు కూడా సరదాగా ఆటపట్టించాడు. మరోవైపు ఇంటర్వ్యూకు వెళ్తున్నానని చెప్పిన సుందరి, తన ప్రియుడు కిషోర్ను కలవడం అసలు ట్విస్ట్గా నిలిచింది. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పి వెంటనే పెళ్లి చేసుకోవాలని కిషోర్పై ఒత్తిడి తీసుకొచ్చింది. ఇదంతా బాలు అనుమానంగా గమనించడంతో కథ మరింత ఆసక్తికరంగా మారింది. చివర్లో బాలు ఏదో ముఖ్యమైన విషయం కోసం ఎదురుచూస్తూ సస్పెన్స్ క్రియేట్ చేయడంతో, సుందరి-కిషోర్ ప్రేమ బయటపడుతుందా అనే ఉత్కంఠతో ఎపిసోడ్ ముగిసింది.
MIB Day 9 Collections: వీకెండ్లో 'మా ఇంటి బంగారం' దూకుడు.. సమంత మూవీకి ఎన్ని కోట్లంటే?
మంగళవారం ఎపిసోడ్లో భావోద్వేగాలు, ట్విస్టులతో కథ ఆసక్తికరంగా సాగింది. బాలు ప్రవర్తనలో మార్పు గమనించిన ప్రభావతి కారణం అడగగా, ఇల్లు తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అయితే వెంటనే బ్యాంక్ అధికారి వచ్చి మీనా పేరుతో కరెంట్ అకౌంట్ ప్రారంభించేందుకు బాలు లక్ష రూపాయలు డిపాజిట్ చేశాడని చెప్పడంతో అందరూ ఆనందపడ్డారు. భార్య ప్రతిభను గుర్తించి ఆమె ఎదుగుదలకు అండగా నిలిచిన బాలును శృతి ప్రశంసించగా, మనోజ్ మాత్రం వ్యంగ్యంగా మాట్లాడడంతో ముళ్లకంప ఆగ్రహంతో అతడిపై చేయి చేసుకున్నాడు.
మరోవైపు మీనా విజయాన్ని చూసి మనోజ్, ప్రభావతి అసూయతో రగిలిపోతారు. ఇదే సమయంలో జీఎస్టీ నోటీసు గురించి రోహిణి హెచ్చరించినా మనోజ్ నిర్లక్ష్యం చేస్తాడు. అనూహ్యంగా జీఎస్టీ అధికారులు వచ్చి అతని షాపును మూసివేసి, మూడు గంటల్లో రూ.3 లక్షలు చెల్లించకపోతే శాశ్వతంగా సీజ్ చేస్తామని తేల్చిచెప్పారు. ఈ పరిణామంతో మనోజ్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మరోవైపు స్కూల్ దగ్గర బాలు కనిపించడంతో రోహిణి మరింత కంగారుపడింది. మనోజ్ను కాపాడేందుకు సుగుణమ్మను నగలు తీసుకురమ్మని కోరిన రోహిణి, వాటిని తన పేరుతో కాకుండా విద్య పేరుతో తాకట్టు పెట్టాలని కొత్త ప్లాన్ వేయడంతో ఎపిసోడ్ ఉత్కంఠగా ముగిసింది.
బుధవారం ఎపిసోడ్లో మనోజ్కు ఊహించని షాక్ తగిలింది. జీఎస్టీ అధికారులు ఇచ్చిన గడువు ముగిసిందని, ఫైన్ చెల్లించకపోవడంతో షాపును సీజ్ చేస్తామని హెచ్చరించగా మనోజ్ తీవ్ర ఆందోళనకు గురవుతాడు. చివరి నిమిషంలో రోహిణి చెక్ ఇవ్వడంతో అధికారులు డబ్బు తీసుకుని, ఇకపై పన్నులు నిర్లక్ష్యం చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు. డబ్బులు ఎక్కడివని మనోజ్ అడగ్గా, స్నేహితురాలి వద్ద అప్పు చేశానని రోహిణి చెప్పినా, ఆమె మనసులో మాత్రం మరో టెన్షన్ కొనసాగుతుంది.
ఇదే సమయంలో బాలు ఇంట్లో మీనాతో మాట్లాడుతూ సుగుణమ్మ, చింటూని చూసిన విషయం చెప్పడంతో రోహిణి ఒక్కసారిగా కంగారుపడుతుంది. మరోవైపు బాలు డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించేందుకు ప్రభుత్వ అనుమతి వచ్చిందని చెప్పడంతో సత్యం ఆనందపడతాడు. అయితే మనోజ్, ప్రభావతిలు మాత్రం అసూయతో రగిలిపోతారు. డ్రైవింగ్ స్కూల్కు ఇంటి అడ్రస్ ఇవ్వడంపై రోహిణి ట్యాక్స్ పేరుతో అభ్యంతరం చెప్పినా, ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదని సత్యం స్పష్టం చేస్తాడు. అనంతరం తన తండ్రి పేరు మీద డ్రైవింగ్ స్కూల్కు నామకరణం చేసిన బాలు, తల్లిదండ్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించాలని నిర్ణయిస్తాడు. చివర్లో కామాక్షి సుందరిని వెంటబెట్టుకుని వచ్చి మరుసటి రోజు పెళ్లిచూపులు ఉన్నాయని చెప్పి, ఆ కార్యక్రమాన్ని బాలు-మీనాలే దగ్గరుండి చూసుకోవాలని కోరడంతో ఎపిసోడ్ ఆసక్తికరంగా ముగుస్తుంది.
Sunitha vs Chinmayi:'మై బాడీ.. మై రైట్' వివాదం.. చిన్మయికి సింగర్ సునీత స్ట్రాంగ్ కౌంటర్!
గురువారం ఎపిసోడ్లో కథ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. బాలు ప్రారంభించిన డ్రైవింగ్ స్కూల్కు తొలి విద్యార్థినిగా మీనా చేరి ఫీజును చెక్కు రూపంలో చెల్లించింది. దీంతో ప్రభావతి వ్యంగ్యంగా మాట్లాడినా, మీనా, శృతి కలిసి ఆమెకు గట్టి కౌంటర్లు ఇచ్చారు. మరోవైపు బాలు డ్రైవింగ్ స్కూల్కు సంబంధించిన అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేయాలని నిర్ణయించుకుని రాజేష్కు బాధ్యతలు అప్పగించాడు. ఇదే సమయంలో రంగ ఇంట్లో సుందరి పెళ్లిచూపుల ఏర్పాట్లు జరుగుతుండగా ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. సుందరి ఇంటి నుంచి కనిపించకుండా పోవడమే కాకుండా, మీనాక్షి నగలను కూడా తీసుకెళ్లింది.
హీరోయిన్లను అలా చూపిస్తారు... సౌత్ ఇండస్ట్రీపై తమన్నా షాకింగ్ కామెంట్స్
తాను మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని, ఈ పెళ్లి ఇష్టం లేదని లేఖ రాసి వెళ్లిపోవడంతో కుటుంబం షాక్కు గురైంది. రంగ కుటుంబ పరువు గురించి ఆందోళన చెందగా, ప్రభావతి పాత విషయాలు ప్రస్తావించి మీనాను అవమానించే ప్రయత్నం చేసింది. అయితే సత్యం ఆమెను వారించాడు. సుందరిని వెతికే బాధ్యతను బాలు తీసుకుని మీనాతో కలిసి ఆమె పాత హాస్టల్కు వెళ్లాడు. అక్కడ మీనా తెలివిగా మాట్లాడడంతో సుందరి స్నేహితురాలు నిజం చెప్పింది. సుందరి చాలాకాలంగా కిషోర్ అనే యువకుడిని ప్రేమిస్తోందని, ఇద్దరూ కలిసి వెళ్లిపోయి ఉండొచ్చని కీలక సమాచారం ఇచ్చింది. మరోవైపు కిషోర్ కుటుంబంలో కూడా ఉద్రిక్తత నెలకొనగా, మాణిక్యం పెద్దలుగా పిల్లల మనసు అర్థం చేసుకోవాలని సూచించాడు.
OG Universe: 'ఓజీ 2' పై హైప్ పెంచిన మేకర్స్.. పవన్ కళ్యాణ్తో స్పెషల్ వీడియో..
శుక్రవారం ఎపిసోడ్ లో సుందరి కిషోర్తో క్షేమంగా ఉందని తెలుసుకున్న బాలు, మీనా ఇద్దరి కుటుంబాలను కలిసి ఒప్పించి వారి పెళ్లికి పెద్దల అంగీకారం తీసుకొచ్చారు. పిల్లలను దూరం చేయడం కంటే వారి ఆనందాన్ని అర్థం చేసుకుని ఆశీర్వదించడం మంచిదని బాలు చెప్పిన మాటలు కిషోర్ తల్లిదండ్రులను కదిలించాయి. మీనా కూడా రెండు కుటుంబాల బంధం విలువను వివరించడంతో వారు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సుందరిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రంగారావు ఆమెను ప్రేమగా క్షమించి, ముందే చెప్పి ఉంటే తానే పెళ్లి చేసేవాడినని భావోద్వేగానికి గురయ్యాడు.
అయితే మీనాక్షి మాత్రం సుందరి క్షేమం గురించి కాకుండా ముందుగా నగల గురించే ప్రశ్నించి తన స్వార్థపూరిత స్వభావాన్ని మరోసారి బయటపెట్టింది. ఈ సమస్యను చక్కగా పరిష్కరించినందుకు బాలు, మీనాలను రంగారావు ప్రత్యేకంగా అభినందించాడు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి ఎప్పటిలాగే బాలు, మీనాలపై విమర్శలు గుప్పించినా, ఇతరుల కష్టాల్లో అండగా నిలవడమే నిజమైన మనిషితనమని ఇద్దరూ ధైర్యంగా సమాధానం ఇచ్చారు. సత్యం కూడా వారిని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడంతో ప్రభావతి అసహనం వ్యక్తం చేసింది. మరోవైపు మనోజ్కు జీఎస్టీ క్లియరెన్స్ రావడంతో రోహిణి ఊపిరి పీల్చుకున్నా, బాలు-మీనాల వల్ల తమ రహస్యాలు బయటపడతాయేమోనని భయపడింది. చివర్లో చింతామణి, ప్రభావతి కలిసి బాలు-మీనాలను టార్గెట్ చేస్తూ మరో కొత్త కుట్రకు శ్రీకారం చుట్టడంతో ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా ముగిసింది.


Click it and Unblock the Notifications




