పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. పవన్ కళ్యాణ్ తొ బద్రి సినిమా ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం.
ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఘన విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత వచ్చిన ్ మగధీర దానిని అధిగమించింది. పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే చిత్రానికి గాను నంది పురస్కారము లభించింది.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు ఘన విజయవంతం అయ్యాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా పోకిరి మరియు పూరి టాకీస్ బ్యానర్ మీద నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రాన్ని నిర్మించాడు.
అలానే యువ దర్శకులని ప్రోత్సహించేదుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపారు. పూరి తన చిత్రాలతో యువతను ఆకట్టుకుంటాడు. అలాగే కొన్ని చిత్రాలలో చిన్న పాత్రలలో నటించాడు.