అందిరి బంధువయ సినిమా డ్రామా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శర్వానంద్, పద్మప్రియ, నరేష్, ఆర్కే, విజయ్ సాయి, ప్రగతి, ఆనంద్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చంద్ర సిద్దార్ద నిర్వహించారు మరియు నిర్మాతలు ఆర్కే, చంద్ర సిద్దార్ద నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూఫ్ రూబిన్స్ స్వరాలు సమకుర్చారు.
కథ
సాప్ట్ వేర్ ఉద్యోగం కోసం పల్లె నుంచి హైదరాబాద్ కు వస్తాడు నందు (శర్వానంద్). ఎవరికీ ఏ సమస్య వచ్చినా అది తనదే అనుకునే అతనికి అక్కడే పద్దు (పద్మప్రియ)తో పరిచయం అవుతుంది. పరమ పీనాసిగా ప్రవర్తించే ఆమె..నందు ప్రేమలో పడి మారుతుంది. ఈ లోగా తన మాస్టారుకి ఓ అవసరం వచ్చి ఐదు లక్షలు అవసరమై అప్పుకోసం ఆ ఏరియా దాదా (ఆర్కే) ని ఆశ్రయిస్తాడు. తాకట్టుగా తన కళ్లు, గుండె పెట్టి అగ్రిమెంట్ రాస్తాడు. ఆ తర్వాత ఆ డబ్బు చెల్లించలేకపోతాడు. మరో ప్రక్క పద్దు అక్కని చేసుకుంటానంటూ వచ్చిన బావ ఆ తర్వాత పద్దుపై మనస్సు పడతాడు. ఇద్దరూ అలా సమస్యల్లో పడతారు. ఆ సమస్యలను వాళ్ళు ఎలా అధిగమించారు అన్న కోణంలో కథ నడుస్తుంది.