కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా యాక్షన్ రోమ్యాంటి కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాణా, నయనతార, మిలింద్ గునాజీ, కోట శ్రీనివాసరావు, రఘుబాబు, బ్రహ్మానందం, హేమ, ఎల్బీ శ్రీరామ్, నాగినీడు, సత్యం రాజేష్ తదితరులు. ప్రత్యేక గీతంలో వెంకటేష్, సమీరారెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్) నిర్వహించారు మరియు నిర్మాతలు: జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
కళ అంటే జాతిని జాగృతం చేసేది అని నమ్మి నాటక సమాజం నడిపే...సురభి సుబ్రహ్మణ్యం (కోట) మనవడు బీటెక్ బాబు (రాణా). నాటకాలపై ఏ మాత్రం ఆసక్తి ఉండని బాబు కి వీసా వస్తే అమెరికా వెళ్లిపోవాలన్నది ఆశయం. అయితే ఈలోగా తాత చనిపోవటంతో ఆయన ఆఖరి కోరిక అయిన తన సొంత ఊరు బళ్లారిలో నాటకాల ప్రదర్శించాలని బయిలుదేరతాడు. బళ్లారిలో మైనింగ్ మాఫియాదే రాజ్యం. మైనింగ్ మాఫియాని రెడ్డప్ప(మిలింగ్ గునాజీ)ఏకపధ్యాధిపత్యంగా నడుపుతూంటాడు. అతనితో అనుకోని పరిస్దితుల్లో బాబు తలపడాల్సి వస్తుంది. అంతేగాక అతనికి తన తల్లి తండ్రులను చంపింది కూడా రెడ్డప్ప అని తెలుస్తుంది. అప్పుడు బాబు...అంత పెద్ద మాఫియా కింగ్ ని ఎలా ఎదుర్కొన్నాడు..తన తాత చివరి కోరక ఎలా తీర్చాడు.. అలాగే ఈ జర్నిలో బాబుకి దేవిక(నయనతార)పరిచయమవుతుంది. ఆ పరిచయం ప్రేమగా ఎలా మారింది వంటి విషయాలు తెరపై చూడాల్సిందే.