విఐపి 2 సినిమా 'రఘువరన్ బీటెక్' సీక్వెల్ గా వస్తోంది ఇది యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ధనుష్, కాజోల్, అమల పాల్, పి సముద్రఖని, సరణ్య పొన్వన్నం, వివేక్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సౌందర్య రజనీకాంత్ వహించారు మరియు నిర్మాత కలైపులి ఎస్ ధను, ధనుష్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సీన్ రొల్డన్ స్వరాలు అందించారు.
కథ
రఘువరన్(ధనుష్) అనితా కన్స్ట్రక్షన్స్లో ఇంజనీరుగా పని చేస్తుంటాడు. తన విఐపి గ్రూఫులోని ఇంజనీర్లతో కలిసి సొంతగా కన్స్ట్రక్షన్ కంపెనీ స్థాపించాలనేది అతడి గోల్. సౌతిండియాలో అతిపెద్ద కంపెనీ ‘వసుంధర కన్స్ట్రక్షన్స్ ఎండీ వసుంధర(కాజోల్)కు కాస్త తల పొగరు ఎక్కువే. తాను కోరుకున్నది సాధించడానికి ఎంతవరకైనా వెళ్లేరకం. రఘవరన్ టాలెంట్ తెలిసి తన కంపెనీలో పని చేయాల్సిందిగా ఆఫర్ లెటపర్ పంపిస్తుంది. రఘువరన్ దాన్ని తిరస్కరించడంతో వసుంధర ఇగో హర్టయి అతడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. అతడు పని చేస్తున్న కంపెనీకి ఎలాంటి ప్రాజెక్టులు రాకుండా అడ్డకుంటుంది. తన వల్ల ఆ కంపెనీకి నష్టం రావడం ఇష్టం లేని రఘువరన్ రాజీనామా చేసి బయటకొస్తాడు. సొంత ఇల్లు తాకట్టుపెట్టి ‘విఐపి కన్స్ట్రక్షన్స్' కంపెనీ మొదలుపెడతాడు. ఈ క్రమంలో వసుంధర నుండి ఎదురైన అడ్డంకులను రఘువరన్ ఎలా అధిగమించాడు అనేది తర్వాతి కథ.