ఏమాయా చేసావె సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, సమంతా, కృష్ణుడు, సంజయ్ స్వరూప్, సురేఖా వాణి తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గౌతం మీనన్ నిర్వహించారు మరియు నిర్మాత సంజమ్ స్వరుప్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎ ఆర్ రహమాన్ స్వరాలు సమకుర్చారు
కథ
ఇరవై రెండు సంవత్సరాల కార్తీక్(నాగ చైతన్య) ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని ఫిల్మ్ దర్శకుడు అవ్వాలని కలలు కంటూంటాడు. అలాగే తన ఇంటి యజమాని కూతురు జెస్సీ(సమంత) అనే ఇరవై నాలుగేళ్ళ అమ్మాయి ప్రేమలో పడతాడు. సాప్ట్ వేర్ ఎంప్లాయి అయిన ఆమె మళయాళి క్రిష్టియన్. అయితే ఆమె వయస్సు తేడా కావటం, మతం వేరు కావటంతో మొదట రిజెక్టు చేస్తుంది. అయితే హ్యాలిడేస్ కు కేరళలోని అలెప్పీ వెళ్ళినప్పుడు ఆమె అతని ప్రేమలోని నిజాయితీని గమనించి అతని వైపు మొగ్గుతుంది. ఆ తర్వాత వారు తమ కుటుంబాలను ఎలా ఒప్పించారు..తాము ఏకం కావటానికి ఉన్న సమస్యలను ఎలా అధిగమించారన్నది భావోద్వేగాలతో చెప్పబడ్డ మిగతా కథ.