ఎవడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్, అల్లు అర్జున్, అమీ జాక్సన్, కాజల్, శృతి హాసన్, జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయి కుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: వంశీ పైడిపల్లి నిర్వహించారు, నిర్మాత: దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
వైజాగ్ సిటీలో వీరూ భాయ్(రాహుల్ దేవ్) పెద్ద దాదా. అతను కన్నేసి,ఎలాగైనా సొంతం చేసుకోవాలనుకున్న దీప్తి(కాజల్)ని గాఢంగా సత్య (అల్లు అర్జున్) ప్రేమిస్తూంటాడు. వీరూభాయ్ నుంచి తప్పించుకోవటానికి సత్య,దీప్తి కలిసి పారిపోతూంటారు. దాంతో వీరూభాయ్ మనుష్యులు...ఆ ప్రేమ జంటను అడ్డుకుని నిర్ధాక్ష్యణంగా చంపేస్తారు. అది జరిగిన కొద్ది రోజులుకు చరణ్(రామ్ చరణ్)వరసగా వీరూభాయ్ మనుష్యులను చంపేయటం మొదలెడతాడు. మరో ప్రక్క ధర్మ(సాయికుమార్) మనుష్యులు...చరణ్ ని గుర్తుపట్టి చంపేయాలని ప్రయత్నిస్తారు. ఇంతకీ చరణ్ ఎవరు...సత్య మర్డర్ కు అతనికి సంభంధం ఏమిటి...ధర్మతో చరణ్ కి పాత పగలు ఏమున్నాయి..ఎందుకు చరణ్ ని చంపాలని ప్రయత్నిస్తున్నారు..ఇలాంటి విషయాలన్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే.