నన్ను దోచుకుందువటే (2018)(U)
నన్ను దోచుకుందువటే స్టోరి
నన్ను దోచుకుందువటే సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం సుధీర్ బాబు, నభా నటాష్, నాజర్, తులసి శివమణి, వైవా హర్ష, వేణు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆర్ ఎస్ నాయుడు వహించారు మరియు నిర్మాత సుధీర్ బాబు అందించారు. ఈ చిత్రానికి సంగీతం బి అజినీష్ లోక్ నాథ్ అందించారు.
కథ
కార్తీక్ (సుధీర్బాబు) సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తుంటాడు. కెరీర్ తప్ప మరో విషయం తెలియదు. అమెరికాకు వెళ్లాలనే బలమైన కోరికతో కెరీర్ ప్లాన్ చేసుకొంటాడు. అనుకోని పరిస్థితుల్లో కార్తీక్ జీవితంలోకి షార్ట్ఫిలింస్లో నటించే మేఘన (నభా నటేష్) ప్రవేశిస్తుంది. తండ్రి (నాజర్) కోసం కార్తీక్, మేఘన లవర్స్గా నాటకం ఆడుతారు. కానీ అనుకోకుండా ఒకరంటే మరొరకరి ఇష్ట ఏర్పడి ప్రేమలో పడుతారు. ఓ పరిస్థితి కారణంగా మేఘన ప్రేమను దూరంగా పెట్టాలనుకొంటాడు? తండ్రి కోసం ఏ పరిస్థితుల్లో కార్తీక్, మేఘన నాటకం ఆడాల్సి వస్తుంది? అమితంగా ప్రేమించే మేఘనను కార్తీక్ ఎందుకు కాదంటాడు? తండ్రి కలలను నిజం చేయడం కోసం కార్తీక్ ఎందుకు పరితపిస్తాడు? చివరకు అమెరికాకు వెళ్లాడా? మేఘనను పెళ్లి చేసుకొన్నాడా? తండ్రి కలలను నిజం చేశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే నన్ను దోచుకుందువటే సినిమా కథ.