ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సునామీలా దూసుకెళ్తున్న హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే ఈ బెంగళూరు బ్యూటీ తన అందం, అభినయం, గ్లామర్ మిక్స్తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.


Click it and Unblock the Notifications
Rukmini Vasanth: కాంతారా బ్యూటీ రుక్మిణి వసంత్ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటారు. స్టైలీష్ లుక్లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.
ప్రస్తుతం దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సునామీలా దూసుకెళ్తున్న హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే ఈ బెంగళూరు బ్యూటీ తన అందం, అభినయం, గ్లామర్ మిక్స్తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
రక్షిత్ శెట్టి సరసన నటించిన “సప్తసాగరాలు దాటి” సినిమాలో నటించి ఒక్కసారిగా స్టార్ రేంజ్లోకి ఎక్కిపోయింది. ఆ సినిమా తర్వాత రుక్మిణి పేరు అన్ని భాషల్లో మారుమోగింది. కన్నడలో స్టార్ హీరోయిన్గా, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకుంటోంది.
కన్నడలో విజయం తర్వాత రుక్మిణి తెలుగు తెరకు “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” సినిమాతో పరిచయమైంది. సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా, రుక్మిణి పెర్ఫార్మెన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది.
ఆ తరువాత రుక్మిణి తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ సరసన మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “మదరాసీ” సినిమాలో ఆమె నటించింది. ఈ సినిమా కూడా అనుకున్నంత సక్సెస్ కాకున్నా.. తన నటనతో తమిళ ఆడియన్స్ మనసులు గెలుచుకుంటుంది
తాజాగా రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న “కాంతారా చాప్టర్ 1” సినిమాలో రుక్మిణి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ మారింది. ఇందులో ఆమె అందం, అభినయం ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఈ సినిమాతో ఆమెకు మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
కాంతార సక్సెస్ తరువాత టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ ప్రాజెక్ట్ “డ్రాగన్”లోనూ రుక్మిణినే హీరోయిన్గా తీసుకున్నారు. అదీ కాక యశ్, గీతూ మోహన్ దాస్ కాంబోలో రూపొందనున్న మరో పాన్ ఇండియా సినిమాలోనూ ఈ బ్యూటీ ఎంపికైనట్లు టాక్ వినిపిస్తోంది. వరుసగా బిగ్ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ రుక్మిణి ఇప్పుడు దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్గా నిలిచింది.