Don't Miss!
- News కేశినేని నాని Vs చిన్ని వార్ లో షర్మిల కొత్త ట్విస్ట్..!!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఫ్రెండ్స్ పోరుకు తలవొగ్గిన ఐశ్వర్యరాయ్.. లేటైనా లేటేస్టుగా!
లేటైనా లేటేస్టుగా అందాల తార ఐశ్వర్యరాయ్ బచ్చన్ సోషల్ మీడియా వెబ్సైట్ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేస్తున్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు అవుతున్నందన్న అంతకుముందే ఇన్స్టాగ్రామ్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. మే 17న బాలీవుడ్ సినీ దేవతలు సోనమ్ కపూర్, దీపికా పదుకొన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో మే 11న ఇన్స్టాగ్రామ్లోకి ఐశ్వర్య అడుగుపెట్టడానికి ముహుర్తం ఖారారైనట్టు తెలుస్తున్నది.
బాలీవుడ్లోనే కాదు, హాలీవుడ్లో కూడా ఐశ్వర్యరాయ్కి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. వారందరికీ దగ్గరయ్యేందుకు ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే బచ్చన్ పరివార్ నుంచి అభిషేక్, అమితాబ్ బచ్చన్లో సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నారు.
సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత తెలుసుకొని త్వరలోనే ఇన్స్టాగ్రామ్లోకి ప్రవేశించనున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో కరణ్ జోహర్, మనీష్ మల్హోత్రా లాంటి స్నేహితులు సోషల్ మీడియాలోకి రావాలని పోరు పెట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని ఆమె అన్నారు.