Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘డి ఫర్ దోపిడి’ శాటిలైట్ రైట్స్ ఎంత?
హైదరాబాద్: వరుణ్ సందేష్, సందీప్ కిషన్, మెలని, నవీన్, రాకేష్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తూ రూపొందుతున్న చిత్రం 'డి ఫర్ దోపిడి'. దొబ్బడానికి? దొబ్బించుకోడానికా? అనేది సబ్ టైటిల్. హిందీలో '99', 'షోర్ ఇన్ ద సిటీ' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కెలు 'డి ఫర్ దోడిపి' చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. సిరాజ్ కల్లాన్ని ఈచిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రం నిర్మాణ టీమ్ లో హీరో నాని కూడా జాయిన్ అయ్యారు. ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కోటి డబ్బై లక్షలుకు జెమినీ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఎప్పటినుంచో తెలుగులో సినిమా చేయాలనుకుంటున్నాం. మా దర్శకత్వంలో ఓ సినిమా తీయడానికంటే ముందు ఒక తెలుగు చిత్రాన్ని నిర్మిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఉన్న మాకు సిరాజ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా ప్రారంభించాం. హిందీలో మేం రూపొందించిన షోర్ ఇన్ ద సిటీ అనే చిత్రానికి అతను అసోసియేట్ డెరెక్టర్గా పనిచేశారు. తెలుగు సినిమాలు చూస్తూ పెరిగిన మేం తెలుగు నేటివిటీకి అనుగుణంగా నిర్మిస్తున్న చిత్రమిది. క్రైమ్, కామెడీ, సెటైర్ అంశాలతో తయారవుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించే సినిమాలు తీయాలన్నది మా ధ్యేయం. వచ్చే ఏడాది రెండు తెలుగు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం అని తెలిపారు.
చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాని మాట్లాడుతూ- ఇబ్బందుల్లో ఉన్న నలుగురు కుర్రాళ్లు ఓ దొంగతనం చేసి ఎటువంటి పరిణామాలకు గురయ్యారనే కధాంశంతో వినోదాత్మకంగా ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని, సన్నివేశంలో హాస్యం ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడని, సినిమా చూస్తేనే నచ్చుతుందని తెలిపారు. తెలుగులో ఓ మంచి చిత్రం తీయాలనే తమ కోరిక ఈ చిత్రంతో తీరిందని, దర్శకుడు కధ చెప్పిన వెంటనే నచ్చి సినిమా ప్రారంభించామని, సినిమా మొత్తం పూర్తయిందని, త్వరలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నామని, నాని, రాజు ఈ సినిమాతో అసోసియేట్ కావడం సంతోషంగా ఉందని నిర్మాతలు తెలిపారు. డిస్ట్రిబ్యూషన్లో ప్రధాన భాగమైన రాజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడం సంతోషంగా ఉందని, ఈ సినిమా మొదటినుండీ చివరివరకూ ప్రేక్షకులను నవ్విస్తుందనీ, తొలి సక్సెస్గా తాము ఈ చిత్రాన్ని భావిస్తున్నామని దర్శకుడు సిరాజ్ కల్ల తెలిపారు.
క్రైం, కామెడీ నేపథ్యంలో ఈచిత్రం సాగుతుంది. ప్రేక్షకులకు సస్పెన్స్ తో పాటు థ్రిల్, కామెడీని ఈచిత్రం నుంచి ఆశించ వచ్చు. ఈ చిత్రంలో ఇంకా తనికెళ్ల భరణి, హేమ, పృథ్వి, పావలా శ్యామల తదితరులు నటిస్తున్నారు. సంగీతం: మహేష్ శంకర్, కెమెరా: లుకాస్, కళ: ఉపేంద్ర రెడ్డి, కూర్పు: ధర్మేంద్ర, నిర్మాతలు: రాజ్ నిడిమోరు, కృష్ణా డి.కె, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సిరాజ్ కల్లా.