హీరోయిన్ ఔట్ : పవన్ కళ్యాణ్కు నచ్చకనే అలా చేసారా?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గబ్బర్ సింగ్ -2' చిత్రంలో అనీషా ఆంబ్రోస్ను హీరోయిన్గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు సమాచారం. ఆమె స్వయంగా తప్పుకుందా? లేక తప్పించారాను అనే విషయంలో సరైన క్లారిటీ లేదు.
వాస్తవానికి అనీషా ఆంబ్రోస్ మీద ముందు నుండి మంచి ఇంప్రెషన్ లేదు మెగా అభిమానుల్లో.... ఆ మధ్య గోపాల గోపాల చిత్రంలో యాంకర్ గా కనిపించిన ఆమె పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకోలేక పోయింది. తాజాగా ఆమె గబ్బర్ సింగ్-2 చిత్రం కోసం జరిపిన స్క్రీన్ టెస్టులో కూడా పవన్ కళ్యాణ్ తో పాటు, దర్శక నిర్మాతలను సంతృప్తి పరచలేక పోయిందని, అందుకే ఆమె స్థానంలో వేరొకరిని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అఫీషియల్ గా ప్రకటన వెలువడాల్సి ఉంది.

‘గబ్బర్ సింగ్-2' చిత్రం షూటింగ్ మే 29 మహారాష్ట్రలోని మల్షెజ్ ఘాట్స్ ప్రాంతంలో ప్రారంభించారు. జూన్ 5తో తొలి షెడ్యూల్ పూర్తయింది కూడా. అయితే షూటింగులో ఇంకా పవన్ కళ్యాణ్ జాయిన్ కాలేదు. రెండో షెడ్యూల్ ను జూలై మొదటి వారంలో ఆరంభిస్తారని, ఆ షూటింగులో పవన్ కళ్యాన్ జాయిన్ అవుతారని తెలుస్తోంది.
గబ్బర్ సింగ్ 2 ఫ్లాస్ బ్యాక్ ఎపిసోడ్లో పవన్ గెడ్డం పెంచుకుని కనపడతారని తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ గెడ్డాలతో షూటింగ్ ఎందుకని, పవన్ తనే స్వయంగా గెడ్డం పెంచుకున్నారని సమాచారం. ఈ గెడ్డంతో వచ్చే ఎపిసోడ్ సినిమాలో హైలెట్ గా నిలువనుందని చెప్పుకుంటున్నారు. ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తోనే ...సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











