Just In
- 13 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 25 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 46 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
- 1 hr ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
Don't Miss!
- News
ఇరుకునపడ్డ బీజేపీ.. వాళ్లెవరో తేల్చాల్సిందే.. నేతాజీ జయంతి వేడుకలో ఆ నినాదాలపై ఆర్ఎస్ఎస్ రియాక్షన్
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Lifestyle
శరీర బరువును వేగంగా తగ్గించే ఈ పుదీనా టీని ఎలా తయారు చేయాలి??
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అటకెక్కిన ఆ చిత్రానికి ఎట్టకేలకు మోక్షం.. ఈసారైనా గోపిచంద్కు కలిసి వచ్చేనా?
ఒక్కోసారి సినిమాలను తెరకెక్కించడమే కాదు.. విడుదల చేయడమూ ఎంతో కష్టతరం అవుతుంది. ఈ ఎన్నో సినిమాలు ఇప్పటికీ ల్యాబ్లోనే పడిఉన్నాయి. వాటన్నంటికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మధ్యలో ఆగినవి కొన్ని.. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నవి కొన్ని.. ఇతర కారణాల వల్ల కొన్ని అటకెక్కుతాయి. ఆ క్రమంలోనే గోపీచంద్ చిత్రమొకటి ఎప్పటి నుంచి వాయిదాలు పడుతూనే వచ్చింది. చివరకు ఆ సినిమా ఊసే మరిచిపోయారు. అయితే ప్రస్తుతం ఆ సినిమా మళ్లీ వార్తల్లోకి ఎక్కింది.

వరుసగా రెండు ప్రాజెక్ట్లు..
గోపీచంద్ ఆ మధ్య వరుసగా రెండు ప్రాజెక్ట్లను లైన్లో పెట్టాడు. గౌతమ్ నందా, ఆరడుగుల బుల్లెట్ అనే రెండు సినిమాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. అయితే ఆరడుగుల బుల్లెట్ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. మధ్యలో మళ్లీ ఓ సారి తెరపైకి వచ్చినా మోక్షం కలగలేదు.

ప్రస్తుతం మరో ప్రయత్నం..
అయితే ప్రస్తుతం ఈ చిత్రాన్ని ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. ఇప్పట్లో థియేటర్లు తెరిచే పరిస్థితి ఎక్కడా కనబడటం లేదు. అందుకే కొంతమంది ఓటీటీ దారిని ఎంచుకున్నారు. తమ సినిమాలను నేరుగా ఆన్లైన్లో వదులుతున్నారు. అయితే గోపీచంద్ ఆరడుగుల బుల్లెట్ను కూడా అదే విధంగా రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారట.

అటకెక్కిన చిత్రం..
2017లోనే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసారు. కానీ ఆర్ధిక లావాదేవీల విషయంలో తేడా రావడంతో వెనక్కి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ప్రముఖ ఓటిటి సంస్థ మంచి రేటు పలికిందట. దీంతో నిర్మాత ఇదే మంచి ఛాన్స్ అని డైరెక్ట్ గా ఆన్లైన్లో విడుదల చెయ్యడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది.

కలిసి వచ్చేనా?
మాస్ డైరెక్టర్ బీ గోపాల్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన తార హీరోయిన్గా నటించింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్కు ఈ సినిమా అయినా కలిసి వస్తుందా? అన్నది చూడాలి. గోపీచంద్ ప్రస్తుతం సీటీమార్ సినిమాను చేస్తున్నాడు.