Don't Miss!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమాలో భారీ మార్పులు...
దాదాపు సంవత్సరం క్రితం మొదలైన త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమా కలేజా(వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన పలు విషయాల్లో మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రం పూర్తి భాధ్యతను తీసుకుని దగ్గరుండి చూస్తున్నట్లు తెలుస్తోంది. నిర్మాత శింగనమల రమేష్ బడ్జెట్ అనుకున్న పరిధి దాటిపోవటం, సినిమా రీ షూటింగ్ జరగటం వంటివి గమనించి ఈ నిర్ణయానికి వచ్చి కళ్యాణ్ కి అప్పచెప్పినట్లు చెప్తున్నారు. కళ్యాణ్ అయితే డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఖర్చు పెడతారని ఆయన్ని ఎంటర్ చేసారంటున్నారు. ఇక ఇప్పటివరకూ పనిచేసిన కెమెరా మెన్ సునీల్ పటేల్ ని మార్చి యాష్ భట్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. యాష్ భట్ ఇంతకు ముందు రామ్ చరణ్ తేజ, ధోణిలతో కూల్ డ్రింక్ యాడ్ చేసారు. ఇక అనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకులతో మంచి అంచనాలే ఉన్నాయి. అతిధి తర్వాత చాలా గ్యాప్ తో మహేష్ బాబు ఈ చిత్రాన్ని చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం అనంతరం శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు చిత్రం ఉంటుంది. సమంతా ఈ చిత్రంలో హీరోయిన్ గా ఉంటోంది.