Don't Miss!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports వరల్డ్ కప్కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కొడుక్కి ఇచ్చినట్లుగానే తనకీ హిట్టిస్తాడని నాగార్జున...
'ఏ మాయ చేసావె' తన తనయుడు నాగచైతన్యకి హిట్టిచ్చినట్లుగానే తనకూ విజయం ఇమ్మన్నట్లుగా గౌతం మీనన్ ని నాగార్జున ఓకే చేసారు. గౌతం మీనన్ దర్శకత్వంలో నాగార్జున కొత్త చిత్రం కమిటయ్యారు. నాగార్జున సోదరి నాగసుసీల నిర్మించే ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రానికి సంభందించి గౌతం మీనన్ చెప్పిన లైన్ నాగార్జున ఇప్పటికే ఓకే చేసి ఉన్నారు. దానికి సంభందించిన పూర్తి స్క్రిప్టుని త్వరలోనే అందచేస్తానని గౌతం మీనన్ హామీ ఇచ్చారు. ఇక చింతలపూడి శ్రీనివాసరావుతో కలిసి నాగసుశీల గతంలో తన కుమారుడు సుశాంత్ ని హీరోగా పెట్టి కాళిదాసు, కరెంట్ చిత్రాలు రూపొందించింది. అవి రెండూ భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక తమిళంలో ప్రస్తుతం గౌతం మీనన్ చేస్తున్న చిత్రం తర్వాత ఈ కొత్త ప్రాజెక్టు ముందుకెళ్థుంది. అలాగే ఈ లోగా నాగార్జున..వీరూపోట్ల దర్శకత్వంలో చిత్రం పూర్తి చేస్తారు.