Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లక్ష్మి మంచు దర్శకుడుతో రాజ్ తరుణ్ నెక్ట్స్
హైదరాబాద్: వరసగా నాలుగు హిట్స్ ( 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్త మావా', 'కుమారి 21F', 'ఈడో రకం ఆడో రకం') కొట్టిన హీరో రాజ్ తరుణ్. ఫన్ తో కలిసిన కథలకు తనదైన యాసను కలిపి డిఫెరెంట్ మ్యానరజంలతో చక్కటి ఈజ్ తో దూసుకుపోతున్న రాజ్ తరుణ్ కథల విషయంలో కూడా విభిన్నత చూపాలనుకుంటున్నాడు.
అందులో భాగంగా తను ఇప్పటివరకూ చేయని క్రైమ్ కామెడీ సినిమాని చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాకు 'దొంగాట' ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది. మంచులక్ష్మి తో చేసిన దొంగాట చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఆ దర్శకుడు అవకాశాలు అయితే రాలేదు. దాంతో ఆయన ఇన్నాళ్లకు రాజ్ తరుణ్ ని డిఫెరెంట్ గా ట్రీట్ చేసిన కథతో ఒప్పించినట్లు తెలుస్తోంది.
బౌండెడ్ స్క్రిప్టు తో కలిసిన వంశీకృష్ణ చెప్పిన కథ బాగా నచ్చడంతో రాజ్ తరుణ్ ఈ సినిమా చేయడానికి అంగీకరించినట్టు తెలిసింది. క్రైమ్ కామెడీ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ పూర్తిగా కొత్తగా ప్రెజెంట్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం దర్శకుడు వంశీకృష్ణ ఈ సినిమా డైలాగ్ వెర్షన్ రెడీ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే రాజతరుణ్ సైతం ఈ స్క్రిప్టులో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.