Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రవితేజ సూపర్ హిట్ సీక్వెల్ లో రామ్ చరణ్??
హైదరాబాద్ : రామ్ చరణ్ వరసగా సినిమాలు కమిటవుతున్నారు. తాజాగా ఆయన మరో చిత్రం కథ విని ఓకే చేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. రవితేజ హీరోగా సురేంద్రరెడ్డి దర్శకత్వంలో వచ్చి విజయవంతమైన కిక్ చిత్రం సీక్వెల్ చేయటానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. రీసెంట్ గా సురేంద్రరెడ్డి వెళ్లి కథని నేరేట్ చేసి చెప్పాడని వెంటనే నచ్చినట్లు తెలియచేసాడని,త్వరలో ఈ చిత్రానికి సంభందించిన వర్క్ ప్రారంభమయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ తో చేస్తున్న రేసు గుర్రం షూటింగ్ ఫినిష్ కాగానే ఈ చిత్రం వర్క్ ప్రారంభం కావచ్చు.
ఈ చిత్రం కాకుండా రామ్ చరణ్ తదుపరి చిత్రం నాగార్జునతో రీసెంట్ గా గ్రీకు వీరుడు వంటి ప్లాప్ చిత్రం అందించిన దశరధ్ తో అని తెలుస్తోంది. ఈ మేరకు దశరథ్ రీసెంట్ గా రామ్ చరణ్ ని కలిసి ఓ కథ వినిపించారని, వెంటనే కథ ఓకే చేసారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం దశరథ్ అదే స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ లోగా రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందే చిత్రం పూర్తి చేసుకుని వస్తారని అంటున్నారు.
మరో ప్రక్క 'జంజీర్' (తుఫాన్) రీమేక్ సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు రామ్చరణ్. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని ఇవ్వటమే కాకుండా విమర్శకుల చేత ఓ రేంజిలో కామెంట్స్ చేయించేలా చేసింది. అయితే పట్టువదలకుండా తాజాగా మరో చిత్రం చేయడానికి రామ్చరణ్ సన్నాహాలు చేసుకొంటున్నారని తెలిసింది.
ఈ కొత్త బాలీవుడ్ చిత్రానికి బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం. 'జంజీర్' చిత్రీకరణ ముంబయిలో జరుగుతున్నప్పుడు చరణ్కి సల్మాన్ ఆతిథ్యం ఇచ్చారు. రామోజీ ఫిల్మ్సిటీలో 'ఎవడు' సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు కూడా ఆ సెట్లో సల్మాన్ ఖాన్ సందడి చేశారు. అప్పట్నుంచి వీరిద్దరూ కలిసి ఓ సినిమాకి పనిచేస్తారనే ప్రచారం మొదలైంది.
ఇటీవల రామ్చరణ్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 2014 ఏడాది ప్రారంభంలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది. ఈ చిత్రం పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని, జంజీర్ లో ఎంటర్టైన్మెంట్ మిస్సయ్యారని, అది ఈ కొత్త చిత్రంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుని సెట్స్ మీదకు వెళ్తారని చెప్తున్నారు.
ఇక ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ కూడా రామ్చరణ్ కోసం ఓ కథని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమాలో చరణ్ నటిస్తేనే బాగుంటుందని అశుతోష్ భావిస్తున్నారట. 'మగధీర' చిత్రాన్ని చూశాక ఆయన ఈ నిర్ణయానికొచ్చినట్టు తెలుస్తోంది.ఇందుకోసం ప్రత్యేకంగా మగధీర ప్రింట్ తెప్పించుకుని మరీ చూసాడని చెప్తున్నారు. రామ్ చరణ్ కూడా ఆయనతో చేయాలని ఆసక్తితో ఉన్నారని అంటున్నారు. 'మగధీర' చూసి ఇంప్రెస్ అయ్యే ఆఫర్...? రామ్ చరణ్ ఇక ఈ చిత్రం భారీవ్యయంతో ఈ చిత్రం రూపొందబోతున్నట్టు సమాచారం.