హీరోగా ఎమ్.ఎస్.రాజు కుమారుడు..డైరక్టర్ ఎవరంటే...
ప్రముఖ నిర్మాత ఎమ్.ఎస్.రాజు తన కుమారుడు సుమంత్ ని హీరోగా త్వరలో పరిచయం కానున్నాడు. డైరక్టర్ గా వియన్ ఆదిత్యని ఎంపిక చేసినట్లు సమాచారం. మే పదవ తేదీన ఈ చిత్రం ప్రారంభం కానుంది. మిర్చి అనే టైటిల్ ని ఈ చిత్రానికి పెట్టనున్నారని సమాచారం. ఇక ఇంతకు ముందు ఎమ్.ఎస్.రాజు, వియన్ ఆదిత్య కాంబినేషన్లో మనసంతా నువ్వే, ఆట చిత్రాలు వచ్చాయి. అలాగే ఈ కొత్త చిత్రం మ్యుజికల్ రొమాంటిక్ కామిడీ అని తెలుస్తోంది. ఇక ఇంతకు ముందు తేజ దర్శకత్వంలో చిత్రం ప్రారంభించటానికి పూజ కూడా చేసిన ఎమ్.ఎస్.రాజు పలు కారణాలతో దానిని విరమించుకున్నాడు. అలాగే ఈ కొత్త చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో పాటలు రికార్డింగ్ కూడా త్వరలో జరగనుంది. హీరోయిన్ గా ముంబై అమ్మాయిని ఎంపిక చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
More from Filmibeat
తేజ ఆట మనసంతా నువ్వే బాస్ దేవి దేవీపుత్రుడు వియన్ ఆదిత్య ఎమ్ ఎస్ రాజు teja aata manasantha nuvve boss chandi devi vn aditya ms raju


Click it and Unblock the Notifications











