Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అర్జున్ రెడ్డి రీమేక్.. ధృవ్కి తండ్రిగా స్టార్ డైరెక్టర్!
స్టార్ హీరో విక్రమ్ తన తనయుడు ధృవ్ ని ఒక రేంజ్ లో చిత్ర పరిశ్రమకు పరిచయం చేయాలని భావించాడు. కానీ ధృవ్ తొలి చిత్రం అనుకున్నంత సాఫీగా జరగడం లేదు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని చూసి ఇంప్రెస్ అయిన విక్రమ్ తన కుమారుడి తొలి చిత్రంగా ఇదే బావుంటుందని భావించాడు. వెంటనే బాల దర్శత్వంలో అర్జున్ రెడ్డి రీమేక్ ప్రారంభించారు. వర్మ టైటిల్ తో ఈ చిత్రం షూటింగ్ జరిగిపోయింది. ట్రైలర్ కూడా విడుదలైంది. కానీ విక్రమ్ కు అవుట్ పుట్ నచ్చకపోవడంతో చిత్రాన్ని రద్దు చేశాడు.
దర్శకుడుని, హీరోయిన్ ని మార్చేసి మళ్ళి కొత్తగా షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రాన్ని ఆదిత్య వర్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గిరిసాయ దర్శత్వంలో ఆదిత్య వర్మ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ధృవ్ కి తండ్రిగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటి బనిత సంధుని ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. 2020లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. బాల తెరకెక్కించిన చిత్రం రద్దయినప్పుడు స్వయంగా నిర్మాతలే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డిఫరెన్సెస్ వలన చిత్రాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.