Don't Miss!
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- News సచివాలయ ఉద్యోగులకు ఎన్నికల విధులపై కీలక నిర్ణయం..!!
- Lifestyle ఈ రోజు రాశి ఫలాలు: ఓ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి..సమస్యలు పెరుగుతాయి
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సమంత, కాజల్ రూట్లో రకుల్ ప్రీత్ సింగ్.. త్వరలోనే బిగ్ న్యూస్!
గ్లామరస్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ లక్కేమిటో గాని అనుకోకుండా డిజాస్టర్ పడితే మళ్ళీ ట్రాక్ లోకి రావడానికి సమయం చాలానే పడుతోంది. కథల ఎంపిక విషయంలో అమ్మడు చేసిన కొన్ని పొరపాట్లు కెరీర్ కు పెద్ద మైనస్ అయ్యాయి. వాటి నుంచి కొలుకునేందుకు కాస్త విబిన్నంగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం కొంతమంది స్టార్ హీరోయిన్స్ సినిమాలతో పాటు ఓటీటీ కంటెంట్ పై కూడా ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా అందరూ కూడా వెబ్ సిరీస్ లలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కానీ ఆ రూట్లో ఇప్పటివరకు సమంత తప్పితే మిగతా వారు అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కూడా త్వరలోనే ఓటీటీ కంటెంట్ తో ఆకట్టుకోవలని ప్రయత్నాలు చేస్తోంది.
ఓటీటీ అనేది నెక్స్ట్ బిగ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటూ ఎన్నో పెద్ద సినిమాలు కూడా అందులో రిలీజ్ అవుతున్నాయి. మంచి అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధమేనని రకుల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చింది. అలాగే అమ్మడు కొన్ని బోల్డ్ సిరీస్ లలో నటించాడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అందులో సోని సంస్థ నుంచి రాబోయే ప్రాజెక్ట్ కూడా ఉన్నట్లు సమాచారం. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ రానుంది. ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే వైష్ణవ్ తేజ్ - క్రిష్ సినిమాను ఫినిష్ చేసింది. అలాగే మరికొన్ని హిందీ తమిళ్ సినిమాలు కూడా చేస్తోంది. అందులో కొన్ని విడుదలకు సిద్దంగా ఉన్నాయి.