Don't Miss!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
క్షమాపణ చెప్పాల్సిందే...ఐశ్వర్యారాయ్ డిమాండ్
తన వ్యక్తిగత జీవితంపై అవాస్తకమైన రాతలు రాసినందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐశ్వర్య రాయ్ తాజాగా ఓ వార్తా పత్రిక ఆఫీసుకు లేఖ రాసారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఐశ్వర్య రాయ్కి 'స్టమక్ ట్యూబర్క్యులోసిస్' వ్యాధి సోకిందని, దానికి సంబంధించి మందులు వాడుతున్నారని, అవి పూర్తయ్యే వరకు ఆమె గర్భం దాల్చడానికి కుదరదని ఓ ముంబయి కి చెందిన ఓ లీడింగ్ వార్తా పత్రిక కథనం ప్రచురించింది.
ఈ విషయంపై అమితాబ్ మాట్లాడుతూ...ఐశ్వర్యకి టీబీ వ్యాధి సోకిందన్న వార్తలో ఏమాత్రం నిజం లేదు. ఓ కుటుంబ పెద్దగా నేను ఈ వార్తని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. అలాగే నా కుటుంబానికి చెందిన మగవాళ్లపైన ఎలాంటి వదంతులు వచ్చినా నేను భరిస్తాను. కానీ నా ఇంటికి చెందిన ఆడవాళ్లని బజారుకి లాగితే చూస్తూ ఊరుకోను. ఐశ్వర్యని నా కూతురిగా భావిస్తున్నాను. ఆమెకి న్యాయం చేయడానికి నా తుది శ్వాస వరకు పోరాడతాను' అని అమితాబ్ పేర్కొన్నారు.
ఆమె భర్త అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ - "నా భార్య అనారోగ్యానికి గురయ్యిందని, అందువల్లే తల్లి కావడంలేదని కథనం ప్రచురించారు. ఇది నిజంగా అమానుషం. నా భార్య జోలికి వస్తే ఊరుకోను. ఈ వదంతి సృష్టించిన సంబంధిత వ్యక్తులు మాకు క్షమాపణ చెప్పాల్సిందే' అని ప్రకటించారు. కానీ ఆ పత్రిక వాటిని లెక్కచేసే స్ధితిలో కనపడటం లేదు.