'బాహుబలి'కి వాహనం సిద్దం (ఫొటో)
హైదరాబాద్: 'బాహుబలి'కి అనువైన రథం సిద్ధమైందని మహీంద్ర సంస్థల అధినేత ఆనంద్ మహీంద్ర తెలిపారు. మహీంద్ర మోటార్స్ నుంచి 'టీయూవీ300' అనే కొత్త శ్రేణి జీప్ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వాహనానికి బాహుబలి ప్రభాస్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.
ఈ ప్రచార చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని శనివారం మహీంద్ర గూప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ ద్వారా 'బాహుబలికి స్వాగతం.. మా వద్ద అనువైన వాహనం సిద్ధంగా ఉంది' అంటూ ట్వీట్ చేశారు.
బాహుబలితో ఓ రేంజిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్ మహేంద్రవారి TUV300 కు నేషనల్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభాస్ తో యాడ్ ని షూట్ చేసారు.

ఈ యాడ్ లో కేవలం ప్రభాస్ వచ్చి ఈ వెహికల్ గురించి చెప్పటమే కాదు కొన్ని ఊపిరిబిగపట్టే సాహసమైన స్టంట్స్ చేసారు. ఈ స్టంట్స్ ని బాలీవుడ్ పాపులర్ యాక్షన్ డైరక్టర్ పర్వీజ్ షేక్ అందించారు.
మహేంద్ర మేనేజ్మెంట్ ఈ యాడ్ ని లావిష్ గా భారీ బడ్జెట్ తో తీసారు. టీవిలో ఈ విజువల్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టన్ చేస్తాయి అంటున్నారు.


Click it and Unblock the Notifications











