Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
అంత బలహీనురాల్ని కాదు:దీక్షాసేధ్
అభినందనలు వచ్చినప్పుడు పొంగిపోయి విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోయేంత బలహీనురాల్ని కాదు అంటోంది దీక్షాసేధ్.వేదం చిత్రం తో పరిచయమైన ఈ ముద్దగుమ్మ తర్వాత మిరపకాయ,వాంటెడ్ చిత్రాలు చేసింది.అలాగే తమిళనాట కూడా ఆమె విక్రమ్,శింబు వంటి స్టార్స్ సరసన చేస్తోంది.ఆమె సినీ పరిశ్రమపై తన అభిప్రాయం చెపుతూ ఇలా స్పందించింది.అలాగే ఏ రంగంలో అయినా మంచి, చెడు రెండూ ఉంటాయి అని క్లారిఫై చేస్తోంది.
రూమర్స్ గురించి మాట్లాడుతూ...నా గురించిన అన్ని విషయాలు మావాళ్లకు తెలుసు. మా మధ్య దాపరికాలు ఉండవు. అందుకని నా గురించి వచ్చే వార్తలను మావాళ్లు నమ్మరు. కాబట్టి రూమర్స్ కి నేను భయపడను. నటిగా నా సత్తా నిరూపించుకోవాలనే లక్ష్యంతో ఇక్కడికొచ్చాను. అది నెరవేర్చుకునే దిశలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయను అని చెప్పుకొచ్చింది.ప్రస్తుతం ఆమె తమిళంలో విక్రమ్ సరసన 'రాజబాట్టయ్", శింబుతో 'వేట్టయ్మన్నన్" చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.