Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
తొలి '3డి' సైకిక్ థ్రిల్లర్ తెలుగులో 'ఓకే'
దేశంలోనే 3డిలో వస్తున్న తొలి సైకిక్ థ్రిల్లర్ మా సినిమా. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ద్వారా తనీశ్ని బాలీవుడ్కు పరిచయం చేస్తున్నాం. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతాం అని నిర్మాత రాజ్వర్మ తమ కొత్త చిత్రం 'ఓకే' గురించి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. చక్రి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా ఎస్ సంతోష్ సమకూరుస్తున్నారు. ఉషాకిరణ్ వారి నచ్చావులే చిత్రంతో పరిచయమైన తనీష్ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు.దిష, అశ్విత హీరోయిన్స్ గా చేస్తున్నారు.
హీరో తనీశ్ మాట్లాడుతూ "నేనిప్పటివరకు చేసిన సినిమాలు వేరు. ఈ సినిమా వేరు. సైకిక్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమా ద్వారా కొత్త తనీశ్ని చూస్తారు" అన్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం రామానాయుడు స్టూడియోస్లో ఉగాది రోజు ప్రారంభమైంది. డి ప్రవీణ్ ఈ చిత్రానికి దర్శకుడు. తొలి సన్నివేశానికి దర్శకుడు వివి వినాయక్ క్లాప్నివ్వగా, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దీనికి దర్శకుల సంఘాధ్యక్షుడు వి సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు.