Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
దళితులకు వ్యతికేమంటూ సినిమాని..
రిజర్వేషన్లు కథాంశంగా తె రకెక్కిన చిత్రం 'ఆరక్షణ్" ప్రదర్శనకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ముంబైతోపాటు రాష్టవ్య్రాప్తంగా ఈ సినిమా ప్రదర్శించేందుకు మార్గం సుగమమైంది. సినిమాను విడుదల చేసేముందే తమకు చూపించాలన్న కొందరి వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ చిత్రంలో దళితులకు వ్యతిరేకంగా కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆర్పీఐ అధినేత రాందాస్ అథవాలే, ఎన్సీపీనేత ఛగన్భుజ్బల్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తదితరులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్రాన్ని విడుదల కానీయబోమని, ఒకవేళ విడుదలైనా దానిని ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించారు. అయితే సినిమా విడుదలపై స్టే విధించాలని కోరుతూ కొందరు కోర్టుకెక్కారు. దీంతో కేసును విచారణకు స్వీకరించిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని కూడా ఈ విషయమై వివరణ కోరింది. హోంశాఖ కార్యదర్శి నుంచి వివరణ వచ్చాక దానిని పరిశీలించిన కోర్టు సినిమాను ప్రదర్శించేందుకు అనుమతినస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రకాష్ ఝా తెరకెక్కించగా అమితాబ్, సైఫ్ అలీఖాన్, దీపికా పదుకొనె తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.