twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ సంగత దర్శకుడు వైద్యనాధన్ మృతి

    By Staff
    |

    Kunnakudi Vaithyanathan
    తన సంగీత మాధుర్యంతో కొన్ని దశాబ్దాలు పాటు ఆశేష ప్రజానీకాన్ని ఉర్రూతలూగించిన కున్నకుడై వైద్యనాథన్ నిన్న రాత్రి చెన్నై లో మరణించారు. 73 సంవత్సరాల వయస్సు ఉన్న ఆయన గత ఐదు రోజులుగా అనారోగ్యంతో చెన్నై హాస్పటిల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. భార్య,నలుగురు కుమారులు,ఓ కుమార్తె,తొమ్మిది మంది మనుమలు కల ఈయన తన పర్శనల్ లైఫ్ ని కూడా చాలా గొప్పగా లీడ్ చేసారు.


    1932 లో లో సంప్రదాయ సంగీత కళాకారుల కుటుంబంలో జన్నించిన ఈయన చిన్నతనం నుంచే సంగీత సాధన చేసి ప్రశంసలు పొందేవారు. దైవం అనే తమిళ చిత్రంలోని వా రాజా వా అనే పాటతో ఆయన సినీ రంగ ప్రవేశం జరిగింది. ఆయన కంపోజ్ చేసిన Marudamalai Mamaniyae Murugaiyya...బాగా పాపులర్ అయి ఇప్పటికీ ఎక్కడో చోట వినపడుతూనే ఉంటుంది. ఎమ్.జి.ఆర్ నవరాత్రి సినిమాకు ఆయన ఇచ్చిన పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

    తన జీవిత కాలంలో ఎందరో అభిమానులను,శిష్యులను, సంగీతానుచరులను సంపాదించుకున్న ఆయన మరణం తమిళ పరిశ్రమను తీవ్ర సంతాపానికి గురిచేసింది.ఆయన 1975 లో తమిళ ప్రభుత్వ కళైమామణి అవార్డును,2005 లో పద్మశ్రీని సొంతం చేసుకున్నారు. ఇక ఆయన ఎంతో మక్కువతో సంగీత ప్రధానంగా రూపొందించిన తోడి రాగం సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X