సైకిలుని ఎత్తిపట్టుకున్న మంచు లక్ష్మి (ఫొటో)
హైదరాబాద్ : ఎప్పుడూ ఉషారుగా ఉంటూ ఏదో ఒక వ్యాపకంతో నిరంతరం వార్తల్లో ఉంటుంది లక్ష్మీ మంచు. తాజాగా ఆమె ఇన్ఫినిటీ రైడ్ 2015 లో ఆగస్టు 15 పాల్గొననుంది. ఈ మేరకు ఆమె సైకిల్ ని పైకి ఎత్తిన ఫొటో ని షేర్ చేసింది. అంతేకాకుకండా డిజైబుల్ పీపుల్ కోసం ఆమె ఓ పేజీని ఓపెన్ చేసానని, ఆ పేజీని లైక్ చేయమని కోరుతోంది. ఆ విషయం తెలియచేస్తూ ఆమె పెట్టిన ఫొటోలను..మ్యాయర్ ని చూడండి...
I am riding on August 15th to promote the Infinity Ride 2015 to raise funds for athletes with disabilities. Let's help...
Posted by Lakshmi Manchu on 24 June 2015
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
గతంలో ‘లక్ష్మీ టాక్ షో', ‘ప్రేమతో మీ లక్ష్మీ' అనే టాక్ షోలతో మంచు లక్ష్మి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మంచు లక్ష్మీ మరో టాక్ షో తో మనముందుకు రానుంది. లక్ష్మీ మంచు చేయనున్న లేటెస్ట్ టాక్ షో పేరు ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'.
మంచు లక్ష్మి మాట్లాడుతూ... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు పేరుతో జీ తెలుగులో సెలబ్రిటీ టాక్ షో చేయబోతున్నాను. త్వరలో దాని వివరాలు వెల్లడిస్తాను అని అన్నారు. ఈ షోని తను చేసిన షోస్ కంటే డిఫరెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అన్నారు.

సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ తీసిన తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తదుపరి చిత్రం ఉంటుంది. తొలిసారి బయట ఆర్టిస్టులతో చిత్రం తీస్తారు. మంచు లక్ష్మి నటించడం లేదు, నిర్మాత మాత్రమే. మంచు లక్ష్మీ నటించిన ‘దొంగాట' సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











