Don't Miss!
- Sports భార్య పేరు చెప్పి.. DK నోరు మూయించిన కోహ్లి Video
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
డ్రగ్స్ కేసు: మంచు లక్ష్మి ట్వీట్ సంచలనం
డ్రగ్స్ వ్యవహారంలో మంచు లక్ష్మి ట్వీట్ చేసింది. కేటీఆర్ కు మద్దతుగా దిగ్విజయ్పై మండి పడింది.
డ్రగ్స్ కేసులో నటి మంచు లక్ష్మి ట్వీట్ సంచలనం అయింది. ఆమె ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ ను సమర్ధిస్తూ దిగ్విజయ్పై మండి పడింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్వీటుకు మంచు లక్ష్మి మద్దతు పలికారు. రామ్ (కేటీఆర్) చెప్పినట్టుగానే దిగ్విజయ్ ఎప్పుడో మతి స్థిమితం కోల్పోయారంటూ ట్వీట్ చేసారు.
Say it like it is Ram. 😠 he's lost it a long time ago.... https://t.co/5vEWkHPmhF
— Lakshmi Manchu (@LakshmiManchu) July 20, 2017
తెలంగాణలో భారీ డ్రగ్స్ స్కాం జరిగిందని, ఇందులో ఇరుక్కున్న వ్యక్తులకు అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు ఉన్నాయని, వారిని ఈ కేసు నుండి కాపాడుతారో? ప్రాసిక్యూట్ చేస్తారో? చూద్దాం అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కోవడం, కేటీఆర్కు సినీ రంగంలో స్నేహితులు ఉండటంతో ఆయన ఇలాంటి ట్వీట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. దిగ్విజయ్కు మంత్రి కేటీఆర్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు. మీరు ఎప్పుడో కోల్పోయారు. రాజకీయాల నుంచి రిటైరై, వయసుకు తగ్గ పనులు చేసుకోవాలంటూ కేటీఆర్ సూచించారు.