Don't Miss!
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ..? తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మేఘా హీరో కొత్త సినిమా ప్రారంభం, ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో నటించబోతున్నారు!
ఘాజీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంకల్ప్ రెడ్డి తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రానా ప్రధాన పాత్రలోసంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ చిత్రం టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాసల్లో ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. తాజాగా ఈ సినిమాను నేషనల్ అవార్డ్ లభించడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం.
ఈ డైరెక్టర్ తన రెండో సినిమాను హీరో వరుణ్ తేజ్ తో చేయ్యబోతున్నడనే అనే విషయం చాలా రోజుల నుండి తెలుసు. ఈరోజు ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. తోలి షాట్ కు నాగబాబు క్లాప్ కొట్టడం జరిగింది. శేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తోన్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు.
రంగస్థలం సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన రామకృష్ణ ఈ సినిమాకు పని చేయ్యబోతుండడం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉండబోతోందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియో లో వేసిన భారి సెట్స్ లో సినిమా కొంతభాగం చిత్రీకరించబోతున్నారు. లావణ్య త్రిపాటి, అతిధి రావ్ హైద్రి ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించబోతున్నారు.