మేఘా హీరో కొత్త సినిమా ప్రారంభం, ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో నటించబోతున్నారు!
ఘాజీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సంకల్ప్ రెడ్డి తన మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. రానా ప్రధాన పాత్రలోసంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజీ చిత్రం టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాసల్లో ప్రేక్షకులను మెప్పించడం జరిగింది. తాజాగా ఈ సినిమాను నేషనల్ అవార్డ్ లభించడం తెలుగు ప్రేక్షకులకు గర్వకారణం.
ఈ డైరెక్టర్ తన రెండో సినిమాను హీరో వరుణ్ తేజ్ తో చేయ్యబోతున్నడనే అనే విషయం చాలా రోజుల నుండి తెలుసు. ఈరోజు ఉదయం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో లో ఈ సినిమా ప్రారంభం అయ్యింది. తోలి షాట్ కు నాగబాబు క్లాప్ కొట్టడం జరిగింది. శేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తోన్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నాడు.

రంగస్థలం సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన రామకృష్ణ ఈ సినిమాకు పని చేయ్యబోతుండడం విశేషం. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా సినిమా ఉండబోతోందని సమాచారం. అన్నపూర్ణ స్టూడియో లో వేసిన భారి సెట్స్ లో సినిమా కొంతభాగం చిత్రీకరించబోతున్నారు. లావణ్య త్రిపాటి, అతిధి రావ్ హైద్రి ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











