Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాలయ్యకు అవమానం... దున్నపోతులపై, ఇంత దారుణంగానా
హిందూపురం నియోజకవర్గం ప్రజలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని, ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడం లేదంటూ టీడీపీ పార్టీని, ఎమ్మెల్యే బాలకృష్ణల పేర్లను దున్నపోతులపై రాసి ఊరేగింపుచేశారు
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలృష్ణ కనిపించడంలేదట. దీంతో నియోజకవర్గ ప్రజలు ఆయన కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా, బాలకృష్ణ కోసం గాలిస్తూ... వింత నిరసనలకు దిగారు. నియోజకవర్గ ప్రజలు బాలయ్యపై ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలు లేకపోలేదు.
తాగునీటి సమస్య
హిందూపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది. దీన్ని పరిష్కరించలేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు, ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు దిగాయి. బాలకృష్ణ సినిమాలు తీయడంపై మాత్రమే దృష్టిపెట్టారని.. నియోజకవర్గాన్ని పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్యే బాలకృష్ణ
అయితే అక్కడితో ఆగకుండా వేసవి నీటి ఎద్దడి నుంచి నానా ఇబ్బందులు పడుతుంటే ఐదు నెలలనుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గానికి రావడం లేదని మండిపడ్డారు. నీరు లేక బిందెడు నీళ్లు కోసం రూ. 10చెల్లించి కొనుగోలు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.
తాగునీటి సమస్య
ఇందులోభాగంగా, బుధవారం తాగునీటి సమస్యను పరిష్కరించాలని, నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి ప్రారంభించాలని కోరుతూ. దున్నపోతులతో ర్యాలీ నిర్వహించారు. అంతేకాదు బాలకృష్ణ కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి..టీడీపీ పార్టీని, ఎమ్మెల్యే బాలకృష్ణల పేర్లను దున్నపోతులపై రాసి ఊరేగింపుచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
సినిమా నా? ప్రజలా?
అయితే ఈ ఉదంతం మీద బాలయ్య ఇంకా స్పందించలేదు, సినిమా నా? ప్రజలా? అనుకున్నప్పుడు కొన్ని వదిలేయక తప్పదు, గతం లోనూ సినీ నటుల్లో చాలామందే ఇలా రెండు పడవలమీదా కాలువేయబోయి జారిపడ్డారు. కొందరు రాజకీయాలని వదిలేసి సినిమాలు చేసుకుంటూంటే మరికొందరు సినిమాలు వదిలేసి రాజకీయాలకే అంకితమైపోయారు. మరి ఇప్పుడు బాలయ్య చూపు ఏవైపో మరి.