Don't Miss!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- News రఘురామకు సీటు పై కసరత్తు - కీలక ప్రతిపాదన, ఖాయమయ్యేనా..!!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
ఇంకా దక్కని గుర్తింపు: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరాశ!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన పార్టీ' స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీ లక్ష్యం అధికారం కాదు...ప్రజల తరుపున ప్రభుత్వాలను ప్రశ్నించడమేనని పవన్ కళ్యాణ్ సభలు పెట్టి మరీ దంచి చెప్పడంతో పలువురు అభిమానులు ఆ పార్టీ వైపు ఆర్షితులయ్యారు.
ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించడంతో....ఆయన మాటపై గౌరవం, అప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకుని సైలెంటుగా ఉన్నారు ఫ్యాన్స్. ఎన్నికలు ముగిసాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో 'జన సేన' పార్టీ గురించిన ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి.
ఇప్పటికైనా 'జనసేన' పార్టీకి సంబంధించి ఎన్నికల సంఘం నుండి గుర్తింపు పొందాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. భవిష్యత్తులో ప్రజల తరుపున ప్రభుత్వాలను ప్రశ్నించడానికి 'జన సేన' పార్టీ ఒక వేదికగా చేసుకోవాలని పలువురు ఫ్యాన్స్ ఉవ్విల్లూరుతున్నారు.
కానీ పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించిన విషయాలపై పెద్దగా దృష్టి పెట్టక పోవడంపై పలువురు ఫ్యాన్స్ నిరాశలో కూరుకు పోయారు. ఇప్పటి నుండే పార్టీ బలోపేతంపై దృష్టి పెడితే 2019 నాటికి మంచి ఫలితాలు సాధించవచ్చని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. కాగా ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్....అవి పూర్తయిన వెంటనే పార్టీకి సంబంధించిన విషయాలపై దృష్టి పెట్టే అవకాశం ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు అంటున్నారు.