Don't Miss!
- News సీఎం పదవి ఊడిపోతుంది, మేము కొట్లాడుకుంటే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈగనోడి !
- Lifestyle సమ్మర్ బ్లాక్ బస్టర్ రిసిపి మ్యాంగో చికెన్ కర్రీ..!ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
వారిరువురికి అవార్డులు రాకపోవడం బాధించింది: రాజమౌళి
టెక్నికల్ గా తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని పెంచిన సినిమాగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నబ్లాక్ బస్టర్ 'మగధీర" చిత్రానికి రెండు జాతీయ అవార్డులు రావడం తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగిన విషయం అయినప్పటికీ ఆ సినిమాకు ఇంకా అవార్డులు ఎక్స్ పెక్ట్ చేసానని, రెండు మాత్రమే రావడంతో డిస్అపాయింట్ మెంట్ అయ్యానని ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఐబిన్ లైవ్ చానల్ టెలిపోన్ లో సమాదానం ఇచ్చాడు. అంతే కాకుండా దీని పై మరేవిధంగా స్పందిచలేనని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తానని చెప్పాడు. అంతే కాకుండా ట్విట్టర్ ద్వారా అవార్డ్ విన్నర్స్ ను తెలియజేసిన ఆయన అభిమానులకు తను స్పెషల్ థాక్స్ తెలియజేశారు.
స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన'కమల్ కణ్ణన్"కు, కొరియోగ్రాఫర్ గా శివశంకర్ మాస్టర్ కు ఈ అవార్డులు రావడం హ్యాపీగానే వున్నప్పటికీ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కు, ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కు రాకపోవడం కొంత బాధ కలిగించింది" అన్నాడు రాజమౌళి. 140కోట్ల రూపాయల భారీ వ్యయంతో, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఝానంతో 'రోబో" చిత్రాన్ని రూపొందిస్తున్న గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూడా ఇప్పటి వరకు సౌత్ లో రూపొందిన సినిమాలన్నింటిలో 'మగధీర" విజువల్ గా, గ్రాఫిక్స్ పరంగా చాలా గొప్ప సినిమా అని ప్రశంసించడం విశేషం.