Don't Miss!
- News ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
కథలో దమ్ముంది కాబట్టి క్వాలిటీ విషయంలో రాజీపడలేదు..
విక్రమ్ వీర్ కథానాయకుడిగా రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'మనసారా" చిత్రం గతవారం విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచీ వస్తోన్న స్పందనను, తొలిచిత్రం అనుభవాలను విక్రమ్ వీర్ శుక్రవారం పత్రికలవారితో వివరిస్తూ-''మొదటి చిత్రంలోనే ఓ చాలెంజింగ్ రోల్ చేసినందుకు ఆనందంగా వుంది. ఆ పాత్రకు నేడు అందరి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. డీ గ్లామర్గా, పిరికివానిగా, అమాయకునిగా నటించాలంటే మొదట్లో కొంత భయపడ్డాను. కానీ రవిబాబుపై నమ్మకంతో నటించాను. ఆయన నా నుంచి మంచి నటనను రాబట్టుకొని, ఈ రోజు సినిమా సక్సెస్కు కారణమయ్యారు.
ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుతుంది. కొత్తజంటతో రవిబాబు సినిమా తెరకెక్కించాలనే సన్నాహాల్లో వున్నప్పుడు అనుకోకుండా ఆయన్నీ కలవడం, ఈ చిత్రంలో హీరోగా ఎంపికకావడం అన్నీ చక చకా జరిగి పోయాయి. కలరిపయ్యా-2 అనే మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో కొనసాగే ఈ ప్రేమకథకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తోంది. కేరళలో ఇప్పటి వరకు ఎవ్వరూ టచ్ చేయని పలు అందమైన లొకేషన్స్లో చిత్రీకరణ చేశాం"" అన్నారు. కథలో దమ్ముంది కాబట్టి క్వాలిటీ విషయంలో రాజీపడకూడదనే భావంతోనే తొలి సినిమాను తన సొంత బేనర్లో నిర్మించామని, తన తండ్రి ప్రకాష్బాబు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు విక్రమ్ వీర్.