Don't Miss!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
పార్లమెంటులో బిల్లు పెట్టి ఇరుక్కుపోయిన బన్నీ విలన్… ఆ విషయంలో దారుణ ట్రోలింగ్!
అల్లు అర్జున్ హీరోగా నటించిన రేసు గుర్రం సినిమాలో విలన్ గా నటించిన రవి కిషన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆ తరువాత కూడా తెలుగులో అనేక సినిమాలు చేసిన ఆయన నిజానికి భోజ్ పురిలో ఒక స్టార్ హీరో. ఇక భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎంపీ కూడా అయినా రవి కిషన్ శుక్రవారం జనాభా నియంత్రణపై ప్రైవేట్ సభ్యుల బిల్లును సమర్పించారు. జనాభా నియంత్రణకు ఈ బిల్లు చాలా ముఖ్యమని, అయితే బిల్లు గురించి తనను సోషల్ మీడియాలో నిరంతరం ట్రోల్ చేస్తున్నారని మీడియా ముందు వాపోయారు. జనాభా నియంత్రణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలోనే విశ్వగురువు అవుతామని లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టే ముందు రవికిషన్ అన్నారు.
జనాభాను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం, జనాభా పెరుగుతున్న తీరు పేలుడు దిశగా సాగుతోందని పేర్కొన్నారు. అయితే రవి కిషన్ కు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. ఈ కారణంగానే బీజేపీ ఎంపీపై ట్రోల్ జరుగుతోంది. ఆయనకు 4 మంది పిల్లలు ఉన్నారని, అయినప్పటికీ జనాభా నియంత్రణపై ఉపన్యాసాలు ఇస్తున్నాడని నెటిజన్లు కామెంట్ చేశారు. ఒక వేళ ఈ చట్టం అమల్లోకి వస్తే రవి కిషన్ తన నలుగురిలో ఇద్దరు పిల్లలను ఎంచుకోవలసి ఉంటుందని రజత్ అనే నెటిజన్ కామెంట్ చేశారు. ప్రతిపాదిత జనాభా నియంత్రణ బిల్లు ప్రకారం ఏ దంపతులు ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలకు జన్మనివ్వలేరు.
ఒక జంటకు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే, వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ మినహాయింపులు మొదలైన వాటి ప్రయోజనం ఇవ్వబడదని పేర్కొన్నారు. ఇక పార్లమెంట్లో 35 సార్లు ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఇంతవరకూ గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన సోషల్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ రిజల్యూషన్ 1969లోని ఆర్టికల్ 22 ఏమి చెబుతోందంటే , ఏ దంపతులకైనా తమకు ఎంతమంది పిల్లలు పుట్టాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది. అలాగే, పిల్లల సంఖ్యను నియంత్రించడం అనేది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తుంది.