దిల్ రాజును డాడీ అనేసింది: స్పీచ్తో ‘ఫిదా’ చేసిన సాయి పల్లవి
ఫిదా ఆడియో వేడుకలో సాయి పల్లవి స్పీచ్ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా దిల్ రాజును ఆమె డాడీ అనేయడం గమనార్హం.
హైదరాబాద్: వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఫిదా'. సోమవారం సాయంత్రం జరిగిన ఆడియో వేడుకలో సాయి పల్లవి స్పీచ్ ఆకట్టుకుంది. తన స్పీచ్ చివర్లో... 'భానుమతి ఒక్కటే పీస్, రెండు మతాలు, రెండు కులాలు, హైబ్రిడ్ పిల్ల' అంటూ ఆమె చెప్పిన డైలాగ్ అభిమానులను ఫిదా చేసింది.
ఈ సినిమాలో ఎన్నో ఎమోషన్స్, చాలా మెమొరీస్ ఉన్నాయని సాయి పల్లవి తెలిపారు. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన శేఖర్ గారికి థాంక్స్ అంటూ ... వచ్చిరాని తెలుగు మాట్లాడుతూ క్యూట్ క్యూట్గా మాట్లాడింది సాయి పల్లవి.
దిల్ రాజు డాడీ ఫిగర్
దిల్ రాజు గారు మాతో ఎంతో ఓపికగా ఉన్నారు. ఆయన నాతో ఎప్పుడూ ప్రొడ్యూసర్గా నడుచుకోలేదు, ఒక డాడీ లాగా, ఫాదర్ ఫిగర్ మాదిరిగానే ఉన్నారు అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చింది.

మెగా ఫ్యాన్స్ తలెత్తుకునేలా చేస్తా, పవన్ ఫ్యాన్ అంటే నచ్చలేదు: వరుణ్ తేజ్
‘ఫిదా' ఆడియో వేడుకలో వరుణ్ తేజ్ మెగా అభిమానులను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు కొన్ని తప్పటడుగులు వేశానని, ఇకపై మంచి సినిమాలు చేస్తానని, అభిమానులు తలెత్తుకునే సినిమాలు చేస్తానన్నారు.

ఫిదా ఖుషి లాంటి సినిమా
ఫిదా ఖుషి లాంటి సినిమా అని.... పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ లో ఉన్నపుడు సుస్వాగతం, తొలి ప్రేమ చిత్రాలు కెరీర్కు ఎలా సపోర్ట్ అయ్యాయో ‘ఫిదా' చిత్రం వరుణ్ తేజ్ కు అలా అవుతుందని అన్నారు.
శేఖర్ కమ్ముల స్పీచ్
ఫిదా సినిమా గురించి ఆ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల స్పీచ్.
మధుప్రియ పెర్ఫార్మెన్స్
ఫిదా ఆడియో వేడుకలో సింగర్ మధు మధుప్రియ పెర్ఫార్మెన్స్.


Click it and Unblock the Notifications











