Don't Miss!
- News కాంగ్రెస్ సర్కారును టచ్ చేస్తే..: బీజేపీ, బీఆర్ఎస్లకు సీఎం రేవంత్ హెచ్చరిక
- Sports LSG vs CSK: ధోనీ పవర్ హిట్టింగ్.. మెరిసిన జడేజా
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత.. విషాదంలో సినీ ఇండస్ట్రీ
ప్రముఖ తమిళ డైరెక్టర్, నటుడు రాజశేఖర్ (62) మృతి చెందారు. ఆదివారం రోజు ఆయన కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి తీవ్రంగా కలచి వేసిందని పేర్కొంటున్నారు.
అనారోగ్యం కారణంగా
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజశేఖర్.. ఇటీవలే చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన చికిత్స పొందుతూ సెప్టెంబర్ 8వ తేదీన తుదిశ్వాస విడిచినట్లుగా ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
దర్శకుడిగా, నటుడిగా సినీ ప్రస్థానం
దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన ''పలైవనచొలై, చిన్నపూవే మెళ్ల పెసు'' వంటి సూపర్ హిట్ సినిమాలను డెరెక్ట్ చేశారు. రాజశేఖర్ చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి కూడా. అదేవిధంగా నటుడిగా భారతీరాజా దర్శకత్వం వహించిన నిజాల్గల్ (1980) సినిమాతో రాజశేఖర్ తెరంగేట్రం చేయడం జరిగింది.
తెలుగులో కూడా.. పలు టీవీ సీరియల్స్
నటుడిగా రాజశేఖర్ తెలుగు తెరపై కూడా కనిపించారు. తెలుగులో వచ్చిన 'బామ్మ మాట బంగారు బాట' సినిమాలో ఆయన నటించారు. దర్శకుడిగా, నటుడిగా వెండితెర ప్రయాణం కొనసాగించిన ఆయన పలు తమిళ టీవీ సీరియల్స్ లోనూ నటించి గుర్తింపు పొందారు. 'శరవణన్ మీనాక్షి' అనే సీరియల్లో హీరో తండ్రి పాత్రలో ఆయన మెప్పు పొందారు.
సోషల్ మీడియాలో సంతాపాలు
రాజశేఖర్ మృతి వార్త తెలుసుకున్న ప్రేక్షకులు ఆయన కుటుంబ సభ్యులకు సంతాపాలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తెలుగు, తమిళ సినీ పరిశ్రమ లోని పలువురు నటులు, దర్శకులు ఆయన మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.