Don't Miss!
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్గా సాయి కుమార్
విజయవాడ సిటీ పోలీసు శాఖ బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటుడు సాయి కుమార్ నిమితులయ్యారు. సిటీ పోలీస్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండేందుకు అంగీకరించినందుకుగాను నగర పోలీస్ కమీషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
విజయవాడ పోలీసులు ‘నాలుగో సింహం' పేరుతో ఓ యాప్ రూపొందించారు. జూన్ 21న సాయి కుమార్ చేతుల మీదుగా ఈ యాప్ విడుదల చేయనున్నారు. విజయవాడ కమీషనరేట్ పరిధిలో పోలీసులు పలు ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటికి సాయి కుమార్ ప్రచార కర్తగా ఉండబోతున్నారు.
తెలుగులో సాయికుమార్ నటించిన ‘పోలీస్ స్టోరీ' చిత్రం పెద్ద హిట్టయింది. పోలీస్ అంటే ఇలానే ఉండాలి అనే రీతిలో ఈ చిత్రం ప్రేక్షకుల గుండెల్లో పాతుకు పోయింది. కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే...కనిపించని ఆ నాలుగో సింమేరా పోలీస్ అంటూ సాయి కుమార్ చెప్పిన డైలాగ్ ఎవరూ మరిచిపోలేనంతగా పాపులర్ అయింది.