Just In
- 49 min ago
ఇంకా చావలేదా? అని అడిగారట.. ట్రోలింగ్పై నటి కామెంట్స్
- 1 hr ago
అభిమాని చర్యకు షాక్.. గుండెపై పచ్చబొట్టు.. సింగర్ యశస్వి క్రేజ్కు నిదర్శనం
- 2 hrs ago
యాంకర్స్కి ఉండాల్సిన ప్రధాన లక్షణమిదే.. గుట్టువిప్పిన సుమ!!
- 3 hrs ago
ప్రభాస్ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్: ఆ మూవీ టీజర్ అప్పటి వరకూ రానట్టేనట
Don't Miss!
- News
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీరం సిఈవో అదర్ పూనవల్లా .. చారిత్రక ఘట్టంలో భాగస్వామ్యం అయ్యామని హర్షం
- Finance
లవర్స్ డే గిఫ్ట్: ఐపీఓ మార్కెట్లోకి డేటింగ్ యాప్: పబ్లిక్ ఇష్యూ: కళ్లు చెదిరే ఆదాయం
- Automobiles
అప్పుడే అయిపోయాయ్.. సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేశారు..
- Sports
నటరాజన్ అరుదైన రికార్డు.. ఆర్పీసింగ్ తర్వాత నట్టూనే!!
- Lifestyle
ఈ ప్రాబ్లమ్స్ మీ మ్యారేజ్ లైఫ్ ని నాశనం చేస్తాయని తెలుసా...!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పిల్లల చిత్రం 'పసంగ' కి మూడు నేషనల్ అవార్డులు
57వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఈసారి తమిళ చిత్ర పరిశ్రమకి మూడు అవార్డులు, ఒక ప్రశంసా పత్రం లభించా యి. ఉత్తమ చిత్రంగా 'పసంగ' అవార్డును అందు కుంది. ఉత్తమ బాలనటులు, ఉత్తమ మాటల రచయి త అవార్డులతో పాటు ప్రత్యేక ప్రశంసా పత్రం కూడా కోలీవుడ్కు దక్కింది. చిన్న పిల్లల నేపథ్యంతో నూత న దర్శకుడు పాండిరాజ్ తెరకెక్కించిన 'పసంగ' చిత్రానికే ఈ మూడు అవార్డులు రావడం విశేషం. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా 'పసంగ' జాతీయ అవార్డు సాధించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ నట దర్శకుడు శశికుమార్ నిర్మించారు. ఇందుకు గాను ఆయనకు అవార్డుతో పాటు రూ.లక్ష నగదు, రజత పతకం బహూకరించనున్నారు. అదే చిత్రంలో నటించిన జీవా, అన్బక్కరసు ఉత్తమ బాలనటులుగా, పాండిరాజ్ ఉత్తమ డైలాగ్ రైటర్గా ఎంపికయ్యారు. ఇందుకుగాను వారికి రూ.50 వేలు నగదు, రజత పతకం కూడా బహూకరించనున్నారు.
అవార్డులు వచ్చిన సందర్భంగా పసంగ చిత్ర నిర్మాత శశికుమార్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ అవార్డును సినీ పరిశ్రమకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. మాటల రచయితగా పాండ్యరాజ్కు అవార్డు రావడం చాలా సంతోషంగా వుందన్నారు. ఆయన చెప్పినదానికన్నా సినిమాను అద్భుతంగా చిత్రీకరించారన్నారు. పిల్లలు కూడా తమ శక్తికి మించి చక్కగా నటించారన్నారు. అనంతరం దర్శకుడు పాండిరాజ్ మాట్లాడుతూ పసంగ చిత్రానికి టెక్నీషియన్ల సహకారం ఎంతో వుందన్నారు. వారి సహకారం లేకపోతే సినిమా అంత బాగా వచ్చేది కాదన్నారు. తాను చెప్పిన కథ విని సినిమా నిర్మించడానికి ఎవ్వరూ ముందుకు రారని భావించానని, కానీ శశికుమార్ ముందుకొచ్చారని తెలిపారు. ఇక శశికుమార్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రమణ్యపురం తెలుగులో అనంతపురంగా రిలీజైంది. అలాగే శశికుమార్ నిర్మిస్తూ నటించిన నాడోడిగల్ చిత్రం తెలుగులో శంభో శివ శంభో చిత్రంగా రీమేక్ అయింది.