Just In
- 10 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 22 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 43 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
- 1 hr ago
‘పుష్ప’ నుంచి ఊహించని సర్ప్రైజ్: ఈ రెండింటిలో ఒకటి గ్యారెంటీ.. ముందే బయటకొచ్చిందిగా!
Don't Miss!
- News
ఇరుకునపడ్డ బీజేపీ.. వాళ్లెవరో తేల్చాల్సిందే.. నేతాజీ జయంతి వేడుకలో ఆ నినాదాలపై ఆర్ఎస్ఎస్ రియాక్షన్
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Finance
దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్
- Lifestyle
శరీర బరువును వేగంగా తగ్గించే ఈ పుదీనా టీని ఎలా తయారు చేయాలి??
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రజనీ పేరుని టట్టుగా వేయించుకుంది(ఫొటో)
హైదరాబాద్: తల్లి తండ్రులపై తనకున్న ప్రేమను పర్మనెంట్ టట్టూ వేయించుకోవటం ద్వారా రజనీకాంత్ కుమార్తె సౌంధర్య చాటింది. రీసెంట్ గా రజనీతో విక్రమ్ సింహా అంటూ 3డి యానిమేషన్ చిత్రం రూపొందించిన ఆమె తన తల్లి తండ్రి పేర్లను తన చేతిపై వేయించుకుంది. ఈ విషయమై ఆమె ట్విట్టర్ లో ఫొటో పెట్టి తెలియచేసింది. మీరు చూస్తున్నది ఆ ఫొటోనే.
ఇక ఇండియాలో 'టాటూ' పరిశ్రమ ఒక గుర్తింపులేని పరిశ్రమగా ఉండేది. గత కొన్నేళ్లుగా ఈ టాటూ పరిశ్రమ 100 శాతం విస్తరించినట్లు మైడాలా డాట్కామ్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. బాలీవుడ్ సినీతారలు హృతిక్ రోషన్, దీపికా పదుకొనే తదితర సినీనటులు తమ శరీరంపై టాటూను పొడిపించుకోవడంతో యువత వీటిపై మోజు పెంచుకుందని ఆ సర్వేలో తేలింది. దేశంలో గత నాలుగేళ్లుగా టాటూ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోందని, ఇందుకు ప్రధానకారణం బాలీవుడ్ అని మైడాలా వ్యవస్థాపకులు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీషాసింగ్ మీడియాకు వివరించారు.

మొదట్లో 18-25 సంవత్సరాలలోపు యువతీ యువకులు తమ శరీరంపై టాటూ వేయించుకునేవారని, ప్రస్తుతం 40ఏళ్లు పైబడినవారు సైతం తమ శరీరంపై ఏదో ఒక భాగంలో టాటూ వేయించుకోవడం ఒక ఫ్యాషన్గా మారిందని అనీషాసింగ్ తెలిపారు. 1960కు పూర్వం కన్నా 1990 నుంచి ఇది ఒక ఫ్యాషన్ సింబల్గా మారింది. టాటూ ఇండస్ట్రీ నేడు పట్టణాలకే పరిమితం కాకుండా పల్లెలకు సైతం విస్తరించింది. పాశ్చాత్య దేశాల్లో టాటూ వేసేందుకు ఉపయోగించే టెక్నిక్లు, డిజైన్లను ఇండియాలో ఉపయోగించడం లేదని ఆ సర్వేలో తేలింది. టాటూ అనేది ఒక ఆర్ట్ మాత్రమే. నేటి యువతరం గుడ్డిగా నూతన పోకడలను అనుసరిస్తున్నారు. టాటూ అనేది జీవితాంతం ఉండే గుర్తు. ఈ టాటూలో డిజైన్లలో ముఖ్యంగా శివుడు, గణేష్, కొటేషన్లు,feather tatoos bright colourకు బాగా డిమాండ్ ఉంది.
టాటూ పరిశ్రమ ఇండియాలో ఉజ్వల భవిష్యత్తు ఉన్న పరిశ్రమ అని ముంబయిలోని అంధేరికి చెందిన టాటూ ఆర్టిస్ట్ సచిన్ షేర్కార్ తెలిపారు. టాటూలు ఒక ఫ్యాషన్ గుర్తుగానే కాకుండా జీవితాంతం ఉండేలా తమ వద్దకు వచ్చే వారిలో కొందరు కోరుకుంటారని ఆయన తెలిపారు. బాలీవుడ్ సినీతారలవల్ల టాటూ పరిశ్రమ మరింత వేగంగా వృద్ధిచెందుతోందని ఆయన తెలిపారు. బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సుసానే రోషన్లు సిక్స్పాయింట్ స్టార్తో టాటూ వేయించుకోవడమే నేటి యువతకు క్రేజ్గా, ఒక ఫ్యాషన్ సింబల్గా మారింది. ప్రియాంక చోప్రా తన కుడి మోచేయిపై Daddy's Little girl అనే టాటూను, అక్షయ్కుమార్ వీపు వెనుకభాగాన తనకుమారుడు 'ఆరవ్' పేరుతో, దీపికా పదుకొనే 'ఆర్కె' అనే టాటూ వేయించుకోవడం నేటి యువతరానికి ఫ్యాషన్గా మారిందని ఆ సర్వేలో వెల్లడైంది.