రమ్యకృష్ణకు నష్టపరిహారం: కోర్టు ఆదేశం

వివరాల్లోకి వెళితే.... నటి రమ్మకృష్ణ చెన్నై ట్రిబ్యునల్ న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను గత 2010 జూలై 23న కీల్పాకంలోని టెక్నోమేక్ ఏజెన్సీ వద్ద నుంచి రూ. 4.68 లక్షలు విలువచేసే జెనరేటరును కొనుగోలు చేశానని తెలిపారు.
అయితే కొద్ది రోజులకే అందులో సమస్యలు తలెత్తటంతో కొత్తది పంపాల్సిందిగా సంస్థ నిర్వాహకులను కోరానని చెప్పారు. అయితే దీనికి సంబంధించి వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దీనిపై న్యాయమూర్తి మోహన్దాస్ సమక్షంలో మంగళవారం సాయంత్రం విచారణ జరిగింది.
నాణ్యతలేని వస్తువును అందజేయడంతో పాటు, మరమ్మతుకు గురైన దాన్ని కనీసం సరిచేసి కూడా ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. బాధితురాలికి ఆమె చెల్లించిన రూ. 4.68 లక్షలతో సహా నష్ట పరిహారంగా రూ. 52 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ఆరు వారాల్లో ఈ మొత్తాన్ని అందజేయాలని ఉత్తర్వులు జారీచేశారు.


Click it and Unblock the Notifications











