Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రమ్యకృష్ణకు నష్టపరిహారం: కోర్టు ఆదేశం
వివరాల్లోకి వెళితే.... నటి రమ్మకృష్ణ చెన్నై ట్రిబ్యునల్ న్యాయస్థానంలో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అందులో తాను గత 2010 జూలై 23న కీల్పాకంలోని టెక్నోమేక్ ఏజెన్సీ వద్ద నుంచి రూ. 4.68 లక్షలు విలువచేసే జెనరేటరును కొనుగోలు చేశానని తెలిపారు.
అయితే కొద్ది రోజులకే అందులో సమస్యలు తలెత్తటంతో కొత్తది పంపాల్సిందిగా సంస్థ నిర్వాహకులను కోరానని చెప్పారు. అయితే దీనికి సంబంధించి వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. దీనిపై న్యాయమూర్తి మోహన్దాస్ సమక్షంలో మంగళవారం సాయంత్రం విచారణ జరిగింది.
నాణ్యతలేని వస్తువును అందజేయడంతో పాటు, మరమ్మతుకు గురైన దాన్ని కనీసం సరిచేసి కూడా ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. బాధితురాలికి ఆమె చెల్లించిన రూ. 4.68 లక్షలతో సహా నష్ట పరిహారంగా రూ. 52 వేలు ఇవ్వాలని ఆదేశించారు. ఆరు వారాల్లో ఈ మొత్తాన్ని అందజేయాలని ఉత్తర్వులు జారీచేశారు.