Don't Miss!
- News సీటు త్యాగం చేసిన ఆ ఎమ్మెల్యేకు జగన్ రాజ్యసభ హామీ-బహిరంగ ప్రకటన..!
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
అక్కడ తమన్నా అభిమానుల పాలాభిషేకం
తమన్నా తాజా చిత్రం పయ్యా రిలీజ్ సందర్భంగా యాభై అడుగల తమన్నా కట్ అవుట్ ని పెట్టి పాలాభిషేకం చేసారు ఆమె అభిమానులు. తమిళనాడులోని టుట్టికారన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఆల్ ఇండియా తంగ పదమయి తమన్నా ఫ్యాన్ క్లబ్ ఒకటి ఏర్పాటయింది. వారు ఈ పాలాభిషేకోత్సవాన్ని చేసారు. అయితే ఈ విషయాన్ని తమన్నా ఖండిస్తోంది. తనకు ఫ్యాన్స్ అశోసియేషన్ ఉందని తెలియదని, అయినా ఇలాంటి అభిషేకాలు తనకు ఇష్టం ఉండవని క్లియర్ గా చెప్తోంది. అంతగా ఇంట్రస్టుగా ఉంటే మరోసారి సినిమా చూడాలి గానీ ఇలా హోర్డింగ్ లు పెట్టడం వంటివి తనకు ఇష్టముండవని తేల్చిచెప్పింది. అలాగే అభిషేకాలు వంటివి భగవంతుడుకి చేయాలి కానీ తనకు చేయకూడదని ఫ్యాన్స్ కు హితవు పలికింది. ఇదిలా ఉండే ఆమెకు గుడి కడతామంటూ మరో ప్రపోజల్ వచ్చింది. దాంతో ఆమె అభిమానానికి హద్దులు ఉండాలి అని చెప్తోంది. ఇక ఇంతకు ముందు ఖుష్బూ, నమితలకు గుడి కడితే, రజనీకాంత్ వంటి స్టార్స్ కి పాలాభిషేకాలు చేసిన సంగతి తెలిసిందే.