Don't Miss!
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టాప్ డైరక్టర్ , ఆయన కుమార్తె పై చెక్ బౌన్స్ కేసు
చెన్నై : ప్రముఖ తమిళ సినీ దర్శకుడు చేరన్, ఆయన కుమార్తె నివేద ప్రియదర్శిలపై పరమకుడి కోర్టులో చెక్కు బౌన్స్ కేసు దాఖలైంది. ఈ నెల 30వ తేదీ ఆ ఇద్దరు న్యాయస్థానంలో హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
వివరాల్లోకి వెళితే చేరన్ ఆయన కుమార్తె నివేద ప్రియదర్శినిలు 'సీ2హెచ్' క్యాసెట్ల విక్రయ సంస్థను నిర్వహిస్తున్నారు. పరమకుడి, పార్తిబనూర్, ముత్తుకుళత్తూరు, కముది, అభిరామం తదితర ప్రాంతాల్లో క్యాసెట్ల విక్రయ హక్కులను పళముత్తునాథన్ పొందారు. ఇందుకోసం ఆయన సీ2హెచ్కు రూ.80 వేల డిపాజిట్ చెల్లించారు.
ఆ సంస్థ నిర్వహణ తీరు సరిగాలేదని భావించిన ఆయన తన డిపాజిట్ను తిరిగి చెల్లించాలని కోరగా అతడికి చేరన్, ప్రియదర్శినిలు జూన్ 27న చెక్కు ఇచ్చారు. అది జులై 10న బ్యాంకులో జమ చేయగా డబ్బులు లేక బౌన్స్ అయింది.
దాంతో పళముత్తునాథన్ పరమకుడి కోర్టులో చేరన్ ఆయన కుమార్తె నివేదపై చెక్కు బౌన్స్ కేసు దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి ఇన్బకార్తికేయన్ చేరన్, ప్రియదర్శినిలు ఈ నెల 30వ తేదీ న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించారు.