twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రముఖ తెలుగు నటి అశ్విని మృతి

    By Srikanya
    |

    Ashwini
    చెన్నై: ప్రముఖ నటి అశ్విని (43) ఆదివారం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా చెన్నైలోని రామచంద్రా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో ఆమె కన్నుమూశారు. అశ్వని హీరోయిన్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సుమారు 150 చిత్రాల్లో నటించారు. ఒక్క తెలుగులోనే హీరోయిన్, ఇతర పాత్రలను కలుపుకుని సుమారు వంద చిత్రాల్లో నటించారు.

    కృష్ణ హీరోగా నటించిన వజ్రాయుధం, కొడుకు దిద్దిన కాపురం, శోభన్‌బాబు నటించిన శ్రీవారు, రాజేంద్రప్రసాద్ సరసన పెళ్లిచేసి చూడు, వివాహ భోజనంబు, కల్యాణచక్రవర్తితో ఇంటిదొంగ ఇంకా స్టేషన్ మాస్టర్, చూపులు కలిసిన శుభవేళ, ఆమె వేగుచుక్క పగటి చుక్క, నీకు నాకు పెళ్లంట, అరణ్యకాండ, బాలమురళి ఎంఎ, అమెరికా అబ్బాయి తదితర చిత్రాల్లో నటించారు. తమిళంలో పార్తీబన్ సరసన పొండాటి తేవై తదితర చిత్రాల్లో నటించారు. నెల్లూరుకు చెందిన అశ్విని నటిగా స్థిరపడిన తర్వాత చెన్నైలోనే నివసిస్తున్నారు.

    సినిమా అవకాశాలు తగ్గడంతో తెలుగు సీరియల్స్ చేస్తున్నారు. ఇటీవలే తెలుగులో ఒక కొత్త సీరియల్‌లో నటించేందుకు సిద్ధమైనా అనారోగ్య కారణాలతో వాయిదా వేసుకున్నట్లు తెలిసింది. ఆమెకు తెలుగు సినీ దర్శకునితో వివాహమై ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది. అశ్వని భౌతికకాయాన్ని ఆదివారమే ఆమె సొంతూరైన నెల్లూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

    English summary
    'Choopulu Kalisina Shubha Vela' film fame Actress Aswani died died at a private hospital in Chennai here following a cardiac arrest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X