Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Vadinamma : తండ్రి సాయంతో శైలు మాస్టర్ స్కెచ్.. బాబు కిడ్నాప్ డ్రామా.. సీత అరెస్ట్?
స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న వదినమ్మ సీరియల్ ఎట్టకేలకు 722 వ ఎపిసోడ్ కి చేరింది. రఘురాం తన కొడుకు రిషి దగ్గరకు వెళుతూ ఉండడంతో శైలు గొడవ చేసి బాబుని, భర్తను తీసుకొని తన పుట్టింటికి వెళుతుంది. తర్వాత రిషి పుట్టిన రోజు అత్తారింట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేసి రఘురాం, సీతను పిలవఋ. అయితే భరత్ సాయంతో రఘురాం సీత ముసలి వాళ్ళ వేషం వేసుకుని అక్కడికి వెళతారు.
అక్కడ వంట వాళ్ళ వేషంలో సెట్ అవ్వడమే కాక వంట కూడా చేసి మెప్పు పొందారు. అంతేకాక లక్ష్మణ్ కు కూడా వాళ్ళు రావడం తెలియడంతో ఆనందంగా ఉంటారు. రాజేశ్వరి ప్లాన్ తో అందరి కంటే ముందు వాళ్ళ చేతుల మీదుగా బాబుకు అక్షింతలు కూడా పడతాయి. దీంతో వాళ్ళందరూ హ్యాపీ
ఈ రోజు ఎపిసోడ్ లో
అయితే శైలు తన తప్పు తెలుసుకుని ఇంటికి వచ్చి క్షమించమని అందరినీ అడుగుతుంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కార్తీక మాసం సంబరాల్లో మునిగి పోయి ఉంటారు. అయితే దుర్గ, పార్వతి కలిసి వంట వాళ్ళు రఘురాం, సీత అని శైలుకు చెప్పడానికి ప్రయత్నించి ఎట్టకేలకు ఆ విషయాన్ని శైలు చెవిన పడేస్తారు.
దీంతో రగిలిపోయిన శైలు తండ్రి దగ్గరకు వెళ్లి విషయం చెబుతుంది. అయితే ఇందులో అల్లుడి హ్యాండ్ కూడా ఉందని నిరూపించాలనుకున్న రాజేంద్ర కుమార్తెకు ప్లాన్ చెబుతాడు. ఆ ప్లాన్ మేరకు ఆమె అమలు పరుస్తుంది కూడా. అక్కడితో నిన్నటి ఎపిసోడ్ ముగించారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
అంతా గమనిస్తూనే
తండ్రి చెప్పిన విధంగానే ప్లాన్ అమలుపరిచిన శైలు ముందుగా తనకు ఆరోగ్యం బాగోలేదు అని ఇంటికి వచ్చేయడం, ఆ తర్వాత తనకు చేపల కూర కావాలి అని అడగడం తెలిసిందే.. దీంతో లక్ష్మణ్ ఎలాగో అప్పుడు కూడా కూర వండింది సీత వదినే కాబట్టి ఇప్పుడు కూడా ఆమె చేత వంట వడ్డిస్తాను అని చెబుతూ బయటకు వెళ్ళి ప్యాకేజింగ్ కవర్ లు తీసుకు వస్తానని చెబుతాడు.
అలా వెళ్ళిన లక్ష్మణ్ ఎవరూ చూడకుండా ప్యాకేజీ కవర్లు తీసుకువస్తారు.. అయితే ఇదంతా తెలిసిన శైలు మాత్రం పై నుంచి అంతా గమనిస్తూనే ఉంటుంది. లక్ష్మణ్ రావడం సీత వండిన చేపల కూర పార్సిల్ కట్టడం సరిగ్గా అదే సమయానికి శైలు బయటకు రావడం జరుగుతుంది. శైలు బయటకు వచ్చి రెడీ అయిందా అని అడిగితే అయిందని చెబుతూ పెడుతుంది.
ఇంట్లో వాళ్ళందరూ
కుటుంబ సభ్యులు అందరూ కలిసి తింటూ ఉన్న సమయంలో ఎలాగో సీత వండిన వంట కదా అని దానిని మెచ్చుకుంటూ భరత్ అనుకోని కామెంట్లు చేస్తాడు. నువ్వు ఇద్దరికీ, పదిమందికి వందమందికి వండినా ఒకే టేస్ట్ వస్తుంది అంటాడు. దీంతో విషయం తెలిసి నాలుక కరుచుకుంటాడు, ఈలోపు శైలు కావాలని వంద మందికి వండడం ఏమిటి అనే విషయాన్ని నాలుగుసార్లు రెట్టించి అడుగుతుంది.
దానికి భారత్ కవర్ చేసుకునే పనిలో భాగంగా అదేమీ లేదని చెబుతూ ఎంతమందికి వండినా అలాగే ఉంటుంది, ఆవిడ చేతి వంట రుచి ఏ మాత్రం మారదు అని చెప్పాను అని అంటాడు..ఆ తర్వాత కూడా శైలు కావాలని ఇది నువ్వు చేసిన వంటే కదా అని భయపెడుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటే ఎందుకో ఇది వంటలమ్మ చేసిన వంట లాగా కాకుండా వదినమ్మ చేసిన వంట లాగా ఉంది అని అంటుంది
గొడవలు జరగడం లేదు ఏమిటి?
తర్వాత కావాలని అంతా వాంతి చేసుకుంటున్నట్లుగా నటిస్తుంది. లక్ష్మణ్ వెళ్లి ఏం జరిగింది అని ప్రశ్నిస్తే ఆమె మనల్ని మోసం చేసింది ఈ కూర ఏమీ బాగోలేదు అంటుంది. అది ఏంటి మేము అందరం తిన్నాం కదా నాకు బాగానే ఉంది కదా అంటే నీకు నచ్చిన వన్నీ నాకు నచ్చాలని లేదు కదా, నాకు మాత్రం నచ్చలేదు ఫోన్ నెంబర్ ఇస్తే ఆవిడ అంత తేలుస్తాను అన్నట్లు మాట్లాడుతుంది.
ఇంతలో లక్ష్మణ్ నెమ్మదిగా శైలు మాటలు మార్చే విధంగా టాపిక్ డైవర్ట్ చేశారు. ఇక మరోపక్క దుర్గా, పార్వతి కూర్చుని మాట్లాడుకుంటారు. అసలు ఏం జరిగింది? శైలుకి విషయం అంతా చెప్పినా కూడా ఇంకా ఎలాంటి గొడవలు జరగడం లేదు ఏమిటి? అని బాధపడుతూ ఉంటారు అసలు ఏం జరుగుతుంది? గొడవ జరిగితే బయటకు ఎందుకు రానివ్వడం లేదు? అని టెన్షన్ పడుతూ ఉంటారు.
నాని తాగి రావడం
మరోపక్క రఘురాం త్వరలో పూరి వెళ్లాలి అని సీతతో చెబుతాడు. బిజినెస్ ఎక్స్టెన్షన్ గురించి భార్యకు చెబుతాడు. నేను నాని ఇద్దరం కలిసి వెళ్దాం అని అంటూ ఉండడంతో నేను కూడా వస్తాను అని అంటుంది సీత. ఈ సారి కాదు రెండో ట్రిప్ కి మనం వెళ్దాం అని అంటాడు. ఇంతలో నాని తాగి రావడం పెద్ద రచ్చకు దారి తీస్తుంది. ఎందుకు తాగి వచ్చావు అంటే అనుకోనివి జరుగుతున్నాయని చెబుతూ తన అత్తగారు తనను బాగా చూసుకుంటారని అప్పుడు అలవాటయింది అనే విషయాన్ని చెబుతాడు. అయితే హుటాహుటిన లోపలికి తీసుకు వెళ్ళమని శిల్పను ఇంట్లో సభ్యులు కోరతారు.
కమింగ్ అప్ లో
ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగించారు. తర్వాత ఎపిసోడ్ కమింగ్ అప్ లో చూపిస్తున్న దాని ప్రకారం శైలుకి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమె హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు చూపిస్తున్నారు. అయితే బాబు కనిపించక పోవడం అనే విషయాన్ని తెర మీదకు తీసుకువచ్చారు. బాబు సీత దగ్గర ఉండడంతో పోలీసులు వచ్చి సీతను పోలీస్ స్టేషన్ కి రమ్మన్నట్లు చూపించారు. దీంతో కుటుంబ సభ్యులు అందరూ షాక్ అవుతున్నారు తర్వాత ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి చూడాలి మరి ఏం జరగబోతోంది.