Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
No Vaccine.. No Shooting.. సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీ
కరోనావైరస్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగులను ప్రారంభించేందుకు టాలీవుడ్ సినీ పరిశ్రమ సిద్ధమవుతున్నది. ఈ మేరకు కొన్ని ప్రమాణికాలను, మార్గదర్శకాలపై కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సంయుక్త సమావేశాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేశాయి. సమావేశమనంతరం ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్కు సంబంధించిన నిపుణులు, కార్మికులకు మార్గదర్శకాలు జారీ చేశాయి.
కరోనావైరస్ను ప్రతిఘటించే వ్యాక్సిన్ను తీసుకొన్న వారినే షూటింగులకు అనుమతించాలని ఈ సమావేశం ప్రధానంగా తీర్మానించింది. గత ఏప్రిల్లో ఆగిపోయిన షూటింగ్స్కు ఆర్టిస్టులు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలను పూర్తి చేయాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. గత రెండు నెలల క్రితం కేటాయించిన డేట్స్ ప్రకారం త్వరలో ప్రారంభం కాబోయే షూటింగులకు, సినిమాలకు సహకరించి వాటిని పూర్తి చేయాలని పేర్కొన్నారు.
షూటింగుకు హాజరయ్యే ఆర్టిస్టులు, నిపుణులు, ఇతర సిబ్బంది వ్యాక్సిన్ తీసుకొన్నట్టు వారి నుంచి ప్రొడక్షన్ హౌస్లు డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలి అని ఈ సమావేశంలో సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అలాగే షూటింగులో పాల్గొనే వారికి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలి. ఆ బాధ్యతను ఫెడరేషన్, సంబంధిత యూనియన్లను తీసుకోవాలని సూచించారు. ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరు సామాజిక బాధ్యతతో మెలుగుతూ పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలని మనవి చేశారు.
తాజా మార్గదర్శకాలపై సినీ వర్గా లనుంచి ఎలాంటి సలహాలుగానీ, ఫిర్యాదులు గానీ, ఏమైనా ఉన్నట్లయితే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారికి వెంటనే తెలియజేయాలని సూచించారు.